ప్రియుడి మోజులో పడి మొగుడిని కడతేర్చింది ఓ భార్య. ప్రకాశం జిల్లా కంభంలో జరిగిందీ ఘటన. అర్ధవీడు మండలంలోని నాగుల వరం గ్రామానికి చెందిన రజనీ, జగన్మోహన్...
ప్రియుడి మోజులో పడి మొగుడిని కడతేర్చింది ఓ భార్య. ప్రకాశం జిల్లా కంభంలో జరిగిందీ ఘటన. అర్ధవీడు మండలంలోని నాగుల వరం గ్రామానికి చెందిన రజనీ, జగన్మోహన్ రెడ్డి భార్యభార్తలు. డాక్టర్ వెంకటనారాయణ కంభంలో మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. రజనీ దంపతులు ఆయన కస్టమర్లు. ఈ క్రమంలో రజనీ, వెంకటనారాయణ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి తమకు అడ్డుగా ఉన్నాడని భావించిన వెంకటనారాయణ, రజనీ సహకారంతో ఆయన హత్యకు పథకం వేశాడు. ఈ క్రమంలో కిరాయి హంతకులకు రూ.10 లక్షలిచ్చి జగన్మోహన్ రెడ్డిని కిడ్నాప్ చేయించాడు వెంకటనారాయణ. తరువాత ఆత్మకూరు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశారు. ఇది కాస్తా బైటపడింది. కేసు విచారణ కోసం సంఘటన స్థలానికి రజనీని పోలీసులు తీసుకెళ్లారు. అక్కడ ఉన్న తన భర్త మృతదేహం చూసి రజనీ నవ్వుకోవటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వారి స్టైల్ లో పోలీసులు విచారించగా రజనీ అసలు విషయం బైటపెట్టింది. దీంతో డాక్టర్ వెంకటనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో రజనీని జగన్మెహన్రెడ్డిని చంపి పడేసిన స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ శవం చూసి ఆమె నవ్వడం పోలీసుల్ని సైతం ఆశ్చర్యపరిచింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire