భర్త నల్లగా ఉన్నాడని.. పెట్రోల్‌ పోసి నిప్పంటించింది

భర్త నల్లగా ఉన్నాడని.. పెట్రోల్‌ పోసి నిప్పంటించింది
x
Highlights

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. భర్త నల్లగా ఉన్నాడన్న కారణంతో ఓ మహిళ తన భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. తీవ్రగాయాల పాలైన ఆ వ్యక్తి...

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. భర్త నల్లగా ఉన్నాడన్న కారణంతో ఓ మహిళ తన భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. తీవ్రగాయాల పాలైన ఆ వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో సోమవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రేమ్‌ శ్రీ అనే మహిళతో సత్యవీర్‌ సింగ్‌కు రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఐదు నెలల పాప ఉంది. అయితే ప్రేమ్‌ శ్రీ తెల్లగా ఉండడంతో తన భర్త నల్లగా ఉండడంతో అతన్ని ఎగతాళి చేసేది. నల్లగా ఉన్న భర్తతో బయటకు వెళ్లడం ఇష్టం లేక ప్రేమ్‌ శ్రీ పలుసార్లు గొడవ పడ్డది. సోమవారం రాత్రి సత్యవీర్‌ నిద్రిస్తుండగా.. అతనిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించింది ప్రేమ్‌ శ్రీ. బాధితుడి కేకలు విన్న స్థానికులు అతడిని రక్షించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యవీర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై సత్యవీర్‌ సోదరుడు హర్వీర్‌ సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories