కార్పోరేటర్ ఆస్పత్రిలో మహిళకు చేదు అనుభవం

కార్పోరేటర్ ఆస్పత్రిలో మహిళకు చేదు అనుభవం
x
Highlights

కాన్పు కోసమని ప్రయివేటు దవాఖానలో చేరిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. పండంటి బిడ్డకి జన్మని ఇచ్చిన తల్లిపై 50 ఏండ్ల వార్డు బాయ్ అఘాయిత్యానికి యత్నించాడు. ఈ విషయం మొత్తం తన భర్తకు చేప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కామాంధుడి అరెస్ట్ చేశారు.

కాన్పు కోసమని ప్రయివేటు దవాఖానలో చేరిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. పండంటి బిడ్డకి జన్మని ఇచ్చిన తల్లిపై 50 ఏండ్ల వార్డు బాయ్ అఘాయిత్యానికి యత్నించాడు. ఈ విషయం మొత్తం తన భర్తకు చేప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కామాంధుడి అరెస్ట్ చేశారు. ఇక వివరాల్లోకి వెళితే.. మెహదీపట్నం ప్రాంతంలో నివసించే ఓ మహిళ నెలలు నిండటంతో 24వ తేదీన బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో గల సెంచురీ దవాఖానలో చేరింది. 26వ తేదిన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం తరువాత ఆమె ఆరోగ్యం కొద్దిగా క్షీణించడంతో డాక్టర్లు ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు.

అయితే ఇదే క్రమంలో ఆడబిడ్డకి జన్మనిచ్చిన తల్లిపై కన్నపడింది అక్కడ పనిచేసే వార్డు బాయ్ అచ్యుతరావు కన్నుపడింది. ఆరోగ్యం క్షీణించి బెడ్ పై పడుకున్న మహిళపై అచ్యుతరావు అసభ్యంగా ప్రవర్తించాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమె శరీర భాగాలను చేతులు వేస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అతడు చేస్తున్నా వికృత చేష్టలు తెలుస్తున్నా కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. తరువాత తన భర్త వచ్చిన తరువాత జరిగిన విషయం మొత్తం చెప్పింది. దీంతో తన భర్త బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించి. నిందితుడిపై ఐపీసీ 354 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అచ్యుతరావును అరెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories