పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసులో కొత్త కోణం..

పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసులో కొత్త కోణం..
x
Highlights

హైదరాబాద్ లో దారుణ హత్యకు గురైన వ్యాపారి రాం ప్రసాద్ హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. వ్యాపార గొడవలతోనే రాంప్రసాద్ హత్య జరిగింది....

హైదరాబాద్ లో దారుణ హత్యకు గురైన వ్యాపారి రాం ప్రసాద్ హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. వ్యాపార గొడవలతోనే రాంప్రసాద్ హత్య జరిగింది. రాంప్రసాద్ హత్య వెనుక మరో వ్యాపారి కోగంటి సత్యం హస్తం ఉందని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ పంజాగుట్టలో దేవుడి ప్రసాదం తింటుకుంటూ వెళుతున్న రాంప్రసాద్ పై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలైన రాం ప్రసాద్ కు యశోద ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాంప్రసాద్ మృతి చెందాడు. రాంప్రసాద్ ను తోటి వ్యాపారి కోగంటి సత్యం హత్య చేయించాడని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. కోగంటి సత్యం తనకు బాకీపడ్డ 50 కోట్లు ఇవ్వడంలేదని విజయవాడ కృష్ణ లంక పోలీసులకు రాంప్రసాద్ కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేశాడని గుర్తు చేశారు. గత నెల రోజుల నుంచి రాంప్రసాద్ ను కోగంటి సత్య బెదిరిస్తున్నాడు అని తెలిపారు. ఇప్పుడు ఏకంగా రాంప్రసాద్ ను దారుణ హత్య చేయించాడని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories