సినిమా చూపిస్తామని చెప్పి.. ఇద్దరు బాలికలను బైక్ పై తీసుకెళ్లి..

సినిమా చూపిస్తామని చెప్పి.. ఇద్దరు బాలికలను బైక్ పై తీసుకెళ్లి..
x
Highlights

ఎన్ని కఠిన చట్టాలు చేసినా దేశంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు మాత్రం ఆగడంలేదు. దేశంలో ఏదో ఒక్కచోట రోజూ మనవ మృగాలకు మహిళాలు బలి అవుతూనే ఉన్నారు....

ఎన్ని కఠిన చట్టాలు చేసినా దేశంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు మాత్రం ఆగడంలేదు. దేశంలో ఏదో ఒక్కచోట రోజూ మనవ మృగాలకు మహిళాలు బలి అవుతూనే ఉన్నారు. తాజాగా సినిమా చూపిస్తామంటూ ఇద్దరు యువకులు కలిసి.. ఇద్దరు చిన్నారులను నమ్మించి తీసుకొచ్చి పదకొండేళ్ల చిన్నారిపై ఒకరు అత్యాచారం చేశాడు. కాగా మరో వ్యక్తి అదే చిన్నారిపై అత్యాచారం చేయబోయే యత్నం చేయగా అత్యాచారానికి గురైన బాలికతో మరో ఎనిమిదేళ్ల చిన్నారి గట్టిగ అరవడంతో ఆ మార్గంలో గుండా వెళ్తున్న యువకులు బాలిక కేకలు విని ఘటన స్థలికి చేరుకొని ఇద్దరు బాలికలను కాపాడి యువకులను పోలీసులకు అప్పగించారు.ఈ ఘటన సైదాబాద్‌ పోలీస్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.

ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌ ఐఎస్‌ సదన్‌ డివిజన్‌ పరిధిలోని ఓ మురికివాడకు చెందిన పదకొండేళ్ల బాలిక ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ చదువుతోంది. అయితే కొన్ని నెలల క్రితమే బాలిక తండ్రి చనిపోగా.. బాలిక తల్లి మతిస్థిమితం కోల్పోయి తాగుడకి బానిసైంది. కాగా శనివారం వసతి గృహం నుంచి బాలిక ఇంటికి వచ్చింది. బాలిక పెద్దమ్మ ఇంటి వద్ద ఓ ఎనిమిదేళ్ల బాలికతో ఆడుకుంటోంది. అయితే పక్కనే నివాసం ఉంటున్న ఇస్లావత్‌ దస్రు (23) అక్కడ ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులకు మాయమాటలు చెప్పి సరూర్‌నగర్‌-గడ్డిఅన్నారంలో ఓ సినిమా థియేటర్‌లో సినిమా చూపిస్తామంటూ నమ్మించాడు.

కాగా చెత్త వ్యాపారం చేసే కేతావత్‌ మోతీలాల్‌ (30)తో చేతులు కలిపి ఆ చిన్నారులను బైక్ పై గడ్డిఅన్నారంలోని సినిమా థియేటర్‌కు సాయంత్రం 6:30 గంటలకు చేరుకున్నారు. అయితే సినిమా మొదలుకావడానికి ఇంకా కొద్ది సమయం ఉందని చెప్పి సినిమా థియేటర్‌కు ఎదురుగా ఉన్న పడుబడ్డ భవనంలోని సెల్లార్‌కి ఆ బాలికలను తీసుకెళ్లారు. ఇద్దరు కలిసి బాలిక చేత బలవంతంగా దుస్తులు తీయించారు.ఇస్లావత్‌ దస్రు మొదటగా బాలిక (11)పై అత్యాచారం చేశాడు. తరువాత మోతీలాల్‌ అత్యాచారం చేయడానికి సిద్ధమయ్యాడు. పక్కనే ఉన్న మరో బాలిక(8) భయపడి గట్టిగా అరుపులు వేయడంతో చుట్టుప్రక్కల ఉన్న స్థానికులు ఘటనస్థలికి చేరుకున్నారు. వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేసి బాలికలను కాపాడారు. యువకులకు చితకబాది సైదాబాద్‌ పోలీసులకు అప్పగించారు. దుండగులు నేరాన్ని అంగీకరించడంతో ఆ ఇద్దరినీ ఆదివారం సాయంత్రం కోర్టుకి తరలించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories