విజయవాడ లో దారుణం.. బాలికపై అత్యాచారం

విజయవాడ లో దారుణం.. బాలికపై అత్యాచారం
x
Highlights

విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని హార్డ్ పేటలో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న 17 సంవత్సరాల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి...

విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని హార్డ్ పేటలో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న 17 సంవత్సరాల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఈ ఘటన వెలుగు చూసింది. బాధితురాలు తన తండ్రికి చెప్పిన వివరాల ప్రకారం చాలా కాలంగా ఇద్దరు యువకులు వేధిస్తున్నారు. తనని లైంగికంగా వేధించడమే కాకుండా అత్యాచారం జరిపారని బాలిక తెలిపింది. సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి తండ్రి. ఫోక్సా యాక్ట్ నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories