కొంప ముంచిన టిక్ టాక్.. భర్తను వదిలేసి ప్రియురాలితో పరారైన భార్య

కొంప ముంచిన టిక్ టాక్.. భర్తను వదిలేసి ప్రియురాలితో పరారైన భార్య
x
Highlights

టిక్ టాక్ వచ్చిన సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది. ఎవరి టాలెంట్ వాళ్లు బయటపెట్టుకునే వేదికగా టిక్ టాక్ పరిచయం అయింది. అయితే, అది కాస్తా మన దేశంలో కొందర్ని తప్పుదోవల్లోకి లాగేస్తోంది.

టిక్ టాక్ వచ్చిన సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది. ఎవరి టాలెంట్ వాళ్లు బయటపెట్టుకునే వేదికగా టిక్ టాక్ పరిచయం అయింది. అయితే, అది కాస్తా మన దేశంలో కొందర్ని తప్పుదోవల్లోకి లాగేస్తోంది. టిక్ టాక్ వీడియోల్లో టాలెంట్ నచ్చి వారితో స్నేహం పెంచుకోవడం.. ఈ క్రమంలో ఇల్లు వదిలి పారిపోవడం.. లేదా ఆత్మహత్యలు ఇలా ఎన్నో జరిగిపోతున్నాయి.

తాజాగా తమిళనాడులో చోటు చేసుకున్న సంఘటన సంచలనం రేకెత్తించింది. ఆరోగ్య లియో అనే వ్యక్తి తమిళనాడు లోని శివగంగై జిల్లా కాలయారుకోవిల్ సమీపం లోని సానాఊరణి లో ఉంటాడు. ఇతనికి జనవరి నెలలో వినీతతో వివాహం జరిగింది. పెళ్ళయిన తరువాత లియో సింగపూర్ లో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్ళాడు. దీంతో వినీత ఒంటరిగా ఉండసాగింది. ఈ క్రమంలో ఆమెకు టిక్ టాక్ వ్యసనం పట్టుకుంది. ఎక్కువసేపు టిక్ టాక్ లో కాలక్షేపం చేసేది. ఇలా ఉండగా వినీతకు కొన్ని రోజులకు టిక్ టాక్ లో అభి అనే యువతి పరిచయం అయింది. ఇద్దరూ వీడియోలు షేర్ చేసుకుంటూ ఉండేవారు. అలా ఆ పరిచయం చాలా దూరం తీసుకుపోయింది. ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చుకోవడం.. వినీత అభి ఫోటోను తన భుజం పై టాటూ వేసుకునేంత వరకూ వెళ్ళిపోయింది వ్యవహారం. ఇది గమనించిన వినీత భర్త లియో ఆమెను ఫోనులోనే మందలించాడు. అయినా ఆమె వినకపోవడంతో సింగపూర్ నుంచి ఇంటికి వచ్చాడు.

ఇంటికి వచ్చిన లియోకు షాక్ తగిలింది. ఇంటి నిండా బోలెడు బహుమతులు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడివి అని అడిగితే అభి ఇచ్చినట్టు చెప్పింది వినీత. ఇక అదే సమయంలో లియో కు తమ బీరువాలో ఉండాల్సిన బంగారు నగలు కనిపించలేదు. దాని గురించి వినీత ను ఆరా తీస్తే తనకు తెలీదని సమాధానం చెప్పింది. దీంతో లియో వినీతను పుట్టింటికి తీసుకువెళ్ళి ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పి ఆమెతో మాట్లాడమని చెప్పి వచ్చేశాడు.

తరువాత ఈ నెల 19వ తేదీన వినీత పుట్టింట్లో నుంచి హఠాత్తుగా మాయమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అభితో పరారైనట్లు వారి విచారణలో తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని వారి కోసం గాలిస్తున్నారు. బీరువాలో కనిపించకుండా పోయిన బంగారు ఆభరణాలను వినీత తన ప్రియురాలికి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రావడంతో ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది. టిక్ టాక్ మాయ ఎంత పని చేస్తోందని అందరూ అనుకుంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories