50 ఏళ్ల మహిళా టీచర్‌పై అత్యాచారం

50 ఏళ్ల మహిళా టీచర్‌పై అత్యాచారం
x
Highlights

ఇంట్లో అద్దెకుంటున్న ఓ మహిళా టీచర్ పై అఘాయిత్యానికి యత్నించాడు ఓ ప్రబుద్ధుడు. కాఫీలో మత్తు మందు కలిపి ఆమెపై తన కామవాంఛను తీర్చుకున్నాడు.

ఇంట్లో అద్దెకుంటున్న ఓ మహిళా టీచర్ పై అఘాయిత్యానికి యత్నించాడు ఓ ప్రబుద్ధుడు. కాఫీలో మత్తు మందు కలిపి ఆమెపై తన కామవాంఛను తీర్చుకున్నాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లో జరిగింది. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. పాక్‌లోని జిన్నాపార్క్ ప్రాంతంలో ఓ ఉపాధ్యాయ జంట ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. వృత్తిరిత్యా ఆమె భర్త వేరే చోట పనిచేస్తున్నాడు. సెలవుదినాల్లో ఇంటికి వచ్చి వెళ్తాడు.

ఈ నెల 1వ తేదీన ఆ ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ ఇంటి యజమాని రెండో కుమారుడిపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు చెప్పింది. పోలీసులు విచారించగా యజమాని కుమారుడు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే దొంగిలించిన వాటిని తిరిగి కొనిస్తాని ఇంటి యజమాని చెప్పాడు. దీంతో పోలీసులు అతన్ని వదలిపెట్టారు. వారం గడిచిన వస్తువులు తిరిగి ఇవ్వకపోవడంపై మహిళా టీచర్ భర్త యజమానిని అడిగాడు.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యజమాని మరో సారి వస్తువుల కోసం వస్తే టీచర్ కూతురిని హత్య చేస్తానని బెదిరించాడు. దీంతో వారిని వస్తువులు అడగడం మానేశారు. అక్టోబర్ 15న యజమాని పెద్ద కుమారుడు.తన సోదరుడు దొంగిలించిన వస్తువులు ఇస్తానని చెప్పి మహిళా టీచర్‌ను ఇంటికీ రమ్మని చేప్పాడు. దీంతో యజమాని ఇంటికి వెళ్లింది. కాఫీలో తెస్తానని చెప్పి మత్తుమందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళా టీచర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొనియువకుడిని అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories