ప్రియాంకరెడ్డి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. కిటికీలోంచి..

ప్రియాంకరెడ్డి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. కిటికీలోంచి..
x
Highlights

ప్రియాంకారెడ్డి రేప్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద ఉన్న రూమ్‌లోకి దుండగులు ప్రియాంకారెడ్డిని...

ప్రియాంకారెడ్డి రేప్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద ఉన్న రూమ్‌లోకి దుండగులు ప్రియాంకారెడ్డిని లాక్కెళ్లారు. నలుగురు కలిసి నోట్లో బట్ట కుక్కి ఈడ్చుకు వచ్చినట్లు తెలుస్తోంది. టోల్‌ ప్లాజా వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలోని ఓ గదిలో అత్యాచారం చేసేందుకు కిరాతకులు యత్నించారు. డోర్ లాక్ ఉండటంతో కిటికి లోంచి లోపలికి నెట్టే ప్రయత్నం చేశారు నిందితులు. సాధ్యం కాకపోవడంతో రూమ్ బయటే అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.

ప్రియాంక హత్య కేసులో నిందితులు రాయచూర్ నుండి లోడ్ అన్‌ లోడ్ చేసుకుని శంషాబాద్ టోల్ ప్లాజా పక్కన లారీలు పార్కు చేశారు. సాయంత్రం 5 గంటల నుండే పీకల్లోతు మత్తులో నిందితులు ఉన్నారు. ప్రియాంక బైక్ పార్కు చేయడం చూసి ఆమె వచ్చే లోపు ప్రధాన నిందితుడు మహ్మద్ పాషా బైక్ టైర్ పంక్చర్ చేసి పెట్టాడు. ఆమె రాగానే పంకర్చ్ డ్రామా ఆడారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories