రక్షాబంధన్ రోజునే విషాదం.. అన్నకి రాఖీ కట్టి వస్తుండగా

రక్షాబంధన్ రోజునే విషాదం.. అన్నకి రాఖీ కట్టి వస్తుండగా
x
Highlights

రక్షాబంధన్ సందర్భంగా తన సోదరుడికి రాఖీ కట్టి వస్తుండగా ఓ మహిళ తన భర్తతో పాటు కుమార్తెతో ప్రాణాలను కోల్పోయంది . ఈ ఘటన మొయినాబాద్ మండలం నక్కలపల్లి వద్ద...

రక్షాబంధన్ సందర్భంగా తన సోదరుడికి రాఖీ కట్టి వస్తుండగా ఓ మహిళ తన భర్తతో పాటు కుమార్తెతో ప్రాణాలను కోల్పోయంది . ఈ ఘటన మొయినాబాద్ మండలం నక్కలపల్లి వద్ద గురువారం సాయంత్రం జరిగింది. చేవెళ్ల-శంషాబాద్ రహదారిపై నక్కపల్లి వద్ద అతివేగంతో వచ్చిన జేసీబీ వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీనితో అ బైక్ పై ఉన్న నలుగురులో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు . ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు ..

కొత్తూరు మండలం సుభాన్‌పూర్ గ్రామానికి చెందిన పోచారం బాల్‌రెడ్డి (45), జ్యోతి (40) దంపతులకి సాయి చరణ్ మరియు శిరిష సంతానం .. జ్యోతి చేవెళ్లలో నివాసం ఉంటున్న తన సోదరుడు శ్రీనివాస్ రెడ్డికి రాఖీ కట్టేందుకు వెళ్ళింది . అ తర్వాత తిరిగి ఇంటికి బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది . ఈ ప్రమాదంలో సాయి చరణ్ తీవ్రగాయాలపాలు అయి ప్రాణాలతో బయటపడ్డాడు .తన కుటుంబ సభ్యుల మృతదేహాలను చూస్తూ సాయి చరణ్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు . ఈ ఘటనపై సాయి చరణ్ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories