వీడిన ప్రియాంకా రెడ్డి మర్డర్‌ మిస్టరీ.. ప్రధాన నిందితుడు మహ్మద్‌ పాషాగా గుర్తింపు

వీడిన ప్రియాంకా రెడ్డి మర్డర్‌ మిస్టరీ.. ప్రధాన నిందితుడు మహ్మద్‌ పాషాగా గుర్తింపు
x
Highlights

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్‌ ప్రియాంకరెడ్డి హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అదుపులోకి తీసున్నారు. లారీ...

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్‌ ప్రియాంకరెడ్డి హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అదుపులోకి తీసున్నారు. లారీ డ్రైవర్లతో పాటు క్లీనర్లు కలిసి ప్రియాంకరెడ్డిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు నిర్ధారించారు.

నిందితులు రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన వారిగా తెలుస్తోంది. టోల్‌ప్లాజా వెనకాల ఉన్న ఖాళీ ప్రదేశంలో రేప్‌ చేసి హత్య చేశారు నిందితులు. హత్య అనంతరం ప్రియాంకరెడ్డి శరీరానికి దుప్పటి చుట్టి కిరోసిన్‌తో కాల్చేశారు దుండగులు. ప్రియాంకరెడ్డి కేసులో ప్రధాన నిందితుడు మహబూబ్‌ పాషాగా పోలీసులు గుర్తించారు. నిందితుడిది నారాయణపేట జిల్లా మఖ్తల్‌గా తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories