పోలీసుల కస్టడీకి శ్రీనివాస్‌ రెడ్డి

పోలీసుల కస్టడీకి శ్రీనివాస్‌ రెడ్డి
x
Highlights

హాజీపూర్‌ వరుస హత్యల కేసు నిందితుడు మర్రి శ్రీనివాస్‌ రెడ్డిని యాదాద్రి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 13 వరకు పోలీసు...

హాజీపూర్‌ వరుస హత్యల కేసు నిందితుడు మర్రి శ్రీనివాస్‌ రెడ్డిని యాదాద్రి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 13 వరకు పోలీసు కస్టడీకి నల్గొండ కోర్టు అనుమతించడంతో వరంగల్‌ సెంట్రల్‌ జైళ్లో ఉన్న సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డిని తమ అదుపులోకి తీసుకున్నారు. సంచలనం సృష్టించిన ముగ్గురు బాలికల హత్యలతో పాటు కర్నూలులో ఓ మహిళా హత్యకేసులో నిందితుడైన శ్రీనివాస్‌రెడ్డిని విచారిస్తారు.

కల్పన, శ్రావణి, మనీషా అనే ముగ్గురు అమ్మాయిలు అతి కిరాతకంగా హత్యకు గురైన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ఈ దురాగతాలకు శ్రీనివాస్‌రెడ్డికి ఎవరైనా సహకరించారా..? హత్యల వెనుక వేరే కారణాలేమైనా ఉన్నాయా..? అనే కోణంలో విచారణ జరుపుతారు. అలాగే నిందితుడు గతంలో పర్యటించిన ప్రదేశాలైన హైదరాబాద్‌, వేములవాడ, ఆదిలాబాద్‌ ప్రాంతాలకు ఈ కేసులకు ఏదైనా సంబంధం ఉందా..? అనే దానిపై కూడా వివరాలు సేకరించనున్నారు. అలాగే ఈ ముగ్గురు బాలికలే కాకుండా ఇంకా ఎవరినైనా హత్య చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ కస్టడీలో ఇంకెన్ని నిజాలు తెలుస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories