గుంటూరు జిల్లాలో గ్యాంగ్ రేప్‌ ఘటనపై దర్యాప్తు ముమ్మరం.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

గుంటూరు జిల్లాలో గ్యాంగ్ రేప్‌ ఘటనపై దర్యాప్తు ముమ్మరం.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
x
గుంటూరు జిల్లాలో గ్యాంగ్ రేప్‌ ఘటనపై దర్యాప్తు ముమ్మరం
Highlights

గుంటూరు జిల్లా చినకాకాని గ్యాంగ్ రేప్‌ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హాయ్ లాండ్...

గుంటూరు జిల్లా చినకాకాని గ్యాంగ్ రేప్‌ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హాయ్ లాండ్ సమీపంలో మహిళపై ఈ ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే ఈ కేసులో ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి నిందితులను గోప్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు అవుతున్నా ఎస్‌ఐ ఉన్నతాధికారులకు చెప్పకుండా గోప్యంగా ఉంచుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. వివాహితపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు ఉన్నట్లు బాధితురాలి తరపువారు ఆరోపిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories