బ్యూటిషియన్‌ దారుణ హత్య : సైకో కిల్లర్‌ అరెస్టు

బ్యూటిషియన్‌ దారుణ హత్య : సైకో కిల్లర్‌ అరెస్టు
x
Highlights

వరుస హత్యలు, నేరాలకు పాల్పడుతున్న సైకో కిల్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై మూడు హత్య, రెండు చోరీ కేసులున్నాయి. మెదక్‌ జిల్లా రామాయంపేట శివారు...

వరుస హత్యలు, నేరాలకు పాల్పడుతున్న సైకో కిల్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై మూడు హత్య, రెండు చోరీ కేసులున్నాయి. మెదక్‌ జిల్లా రామాయంపేట శివారు చెరువులో వారం క్రితం నిజామాబాద్ వాసి మహిళా బ్యూటిషియన్ శవాన్ని పోలీసులు గుర్తించారు. సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడు పాత నేరస్తుడు నీరుడి అరుణ్ కుమార్‌ డిచ్‌పల్లివాసిగా గుర్తించారు.

అరుణ్ గతంలో మూడు హత్య కేసులు, రెండు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. జైలుకు వెళ్లి వచ్చినా అతని మార్పు రాలేదు. జైలు నుంచి రాగానే బాధితురాలిని హత్యచేసి ఆనవాలు లేకుండా చేయబోయాడు. సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. జైల్లో బాధితురాలి భర్తతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయంతో బాధితురాలితో స్నేహం కలిపాడు. డబ్బు ఆశ చూపి రామాయంపేటకు శివారుకు తీసుకువచ్చి అఘాయిత్యానికి యత్నించాడు. అందుకు ఆమె సహకరించకపోవడంతో గొంతు నులిమి హత్య చేశాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories