నడిరోడ్డుపై కిరాతకం..చనిపోయేవరకూ పొడిచి..పొడిచి..

నడిరోడ్డుపై కిరాతకం..చనిపోయేవరకూ పొడిచి..పొడిచి..
x
Highlights

నడిరోడ్డుపై ఒక యువకుడిని గుర్తు తెలియని దుండగుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఒకసారి కత్తితో పొడిచి.. ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి...

నడిరోడ్డుపై ఒక యువకుడిని గుర్తు తెలియని దుండగుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఒకసారి కత్తితో పొడిచి.. ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి మరణించాడని నిర్ధారణ అయ్యేవరకూ పొడిచి..పొడిచి చంపేశాడు. ఈ దారుణ సంఘటన విశాఖ జిల్లా చోడవరంలో చోటు చేసుకుంది. పట్టణంలోని బీఎన్‌ రోడ్డు ప్రాంతంలోని ఓ మద్యం దుకాణం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. హత్యకు గురైన యువకుడిని చోడవరంలోని ఎడ్లవీధికి చెందిన కోన రాజేశ్‌ (21)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హెల్మెట్ ధరించి ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో రాజేశ్‌ని దారుణంగా హతమార్చాడు. తొలుత కత్తితో కిరాతకంగా నరకడంతో రాజేశ్‌ కిందపడిపోయాడు. ఆ తర్వాత కొద్దిదూరం వెళ్లిన దుండగుడు మళ్లీ వెనక్కి వచ్చి రక్తపుమడుగులో ఉన్న రాజేశ్‌పై మరోసారి తన క్రూరత్వాన్నిచూపించాడు. చనిపోయాడో లేదో అన్న అనుమానంతో మరోసారి కత్తితో పొడిచి.. చనిపోయినట్టు నిర్ధారించుకుని అక్కడినుంచి పరారయ్యాడు. సంఘటనా స్థలాన్ని ఎస్సై లక్ష్మీనారాయణ పరిశీలించారు. రాజేశ్‌పై దాడి చేసిన వ్యక్తి ఎవరు? దీనికి గల కారణాలేంటి? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories