ఎమ్మార్వో ఆత్మహత్య..అసలేం జరిగింది..?

ఎమ్మార్వో ఆత్మహత్య..అసలేం జరిగింది..?
x
Highlights

నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ రూరల్ తహశీల్ధార్ జ్వాల గిరిధర్ రావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్య నగర్ లో అద్దెకున్న తన ఇంట్లో...

నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ రూరల్ తహశీల్ధార్ జ్వాల గిరిధర్ రావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్య నగర్ లో అద్దెకున్న తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లాకు చెందిన గిరిధర్ ఏడాది క్రితం బదిలీపై ఇక్కడకు వచ్చారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్‌తో పాటు ఆర్టీఓ, ఏసీపీ ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మార్వో ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories