చిన్నారి హత్య ఘటనలో వెలుగులోకి కొత్త విషయాలు.. కలిసుండగా చూసిందని కన్న తల్లే..

చిన్నారి హత్య ఘటనలో వెలుగులోకి కొత్త విషయాలు.. కలిసుండగా చూసిందని కన్న తల్లే..
x
Highlights

విజయవాడ నగరం భవానీపురంలో ఎనిమిదేళ్ల బాలిక హత్యా ఘటనలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. కన్న తల్లే చిన్నారి జీవితాన్ని నలిపి వేసినట్లు పోలీసులు...

విజయవాడ నగరం భవానీపురంలో ఎనిమిదేళ్ల బాలిక హత్యా ఘటనలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. కన్న తల్లే చిన్నారి జీవితాన్ని నలిపి వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అమ్మ తనానికే తీరని మచ్చ తెచ్చిపెట్టింది. వివాహేతర సంబంధమే చిన్నారి హత్య చేయించినట్లుగా అనుమానిస్తున్నారు. కన్నబిడ్డను అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన తల్లే ప్రియుడిచే అత్యంత పాశవికంగా హత్య చేయించిందని భావిస్తున్నారు.

చిన్నారి తల్లిదండ్రులు తమ ఇద్దరు అబ్బాయిలను నందిగామ మండలం గోళ్లమూడిలో బంధువుల ఇంటి దగ్గర ఉంచి చదివిస్తున్నారు. ఎనిమిదేళ్ల కుమార్తె ద్వారకను తమ దగ్గరే ఉంచుకున్నారు. ద్వారక రెండో తరగతి చదువుతోంది. చిన్నారి తల్లి ఓ ప్రైవేట్ కళాశాలలో స్వీపర్ గా పని చేస్తున్నది. వీరి పక్కింట్లోనే ప్రకాశ్ దంపతులు అద్దెకు ఉంటున్నారు. టీవీ చూసేందుకు చిన్నారి ద్వారక ప్రకాశ్ ఇంటికి వెళ్లింది. తన తల్లి ప్రకాశ్ తో సన్నిహతంగా ఉండటాన్ని చూసింది చిన్నారి ద్వారక. ఇదే విషయంపై తల్లిని నిలదీసింది.. నాన్నతో చెబుతానని అనడంతో తల్లి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రకాశ్ బాలికను తీసుకెళ్లి హత్య చేశాడు. మృత దేహాన్ని బయటకు తరలించే అవకాశం లేకపోవడంతో సంచిలో మూటగట్టి దాచి పెట్టాడు.

తనకేమీ తెలియదన్నట్లుగా ఉన్న తల్లి అమ్మాయి ఎక్కడుందంటూ భర్తను ప్రశ్నించింది. రాత్రి అయినా రాకపోవడంతో వెదుకుతున్నట్లు నటించింది తల్లి. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఆచూకీ కోసం గాలించారు. ఇదే సమయంలో ఊరి నుంచి వచ్చిన ప్రకాశ్ భార్య కూడా బాలిక కోసం వెతకడం మొదలు పెట్టింది. ఇంట్లో సంచిలో మూటగట్టి ఉంచిన బాలిక మృత దేహాన్ని కనిపెట్టింది. విషయాన్ని గ్రామస్తులకు చెప్పడంతో ద్వారక మృత దేహంగా గుర్తించారు. వెంటనే ప్రకాశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక ముఖం, మెడపై కమిలిన గుర్తులు కనిపించాయి. బాలిక హత్య కేసులో తల్లే నిందితురాలిగా తేలడంతో అంతా నిర్ఘాంత పోయారు.

గతంలోనూ నిందితుడు ప్రకాశ్ మైలవరం నియోజకవర్గం కుంటాముక్కల గ్రామంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన కేసులో రెండు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. కాసేపట్లో బాలిక మృత దేహానికి పోస్ట్ మార్టం జరపనున్నారు. చిన్నారి ఇంటి దగ్గరకు భారీగా చేరుకుంటున్న స్థానికులు నిందితుడిని ఉరితీయాలంటూ నినాదాలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories