అమ్మని కాటేసిన అపకీర్తి.. ప్లాన్ ఫెయిల్ కావడంతో కటకటాలపాలు

అమ్మని కాటేసిన అపకీర్తి.. ప్లాన్ ఫెయిల్ కావడంతో కటకటాలపాలు
x
Highlights

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. నవమాసాలు మోసి, కని పెంచిన తల్లినే కడతేర్చిందో కర్కశ పుత్రిక. చెడు అలవాట్లు...

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. నవమాసాలు మోసి, కని పెంచిన తల్లినే కడతేర్చిందో కర్కశ పుత్రిక. చెడు అలవాట్లు మానుకోవాలని కూతురికి చెప్పడమే ఆ తల్లి పాలిట శాపమైంది. ప్రేమ వ్యవహారానికి అడ్డొస్తుందని భావించిన కూతురు ప్రియుడితో కలిసి తల్లినే హతమార్చింది.

రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ మునగనూరు గ్రామంలో ఘోరం జరిగింది. ప్రేమ వద్దన్నందుకు కన్న తల్లినే కడతేర్చింది ఓ కూతురు. ప్రేమ వ్యవహారంలో మందలించినందుకు ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చింది. రామన్నపేటకు చెందిన పల్లెర్ల శ్రీనివాస్‌రెడ్డి బతుకు దెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి నివాసం ఉంటున్నారు. కూతురు కీర్తి ఇద్దరు యువకులతో ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది. విషయం తెలుసుకున్న తల్లి రజిత కీర్తిని మందలించడంతో ప్రియుడితో కలిసి చంపేసింది.

తండ్రి లారీ డ్రైవర్‌గా డ్యూటీకి వెళ్లగా తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని ప్రియుడితో కలిసి మూడు రోజుల పాటు ఇంట్లోనే గడిపింది. దుర్వాసన రావడంతో అదే ప్రియుడి సహాయంతో స్వగ్రామం రామన్నపేట సమీపంలో రైలు పట్టాల వద్ద మృతదేహాన్ని పడేసింది. తాను వైజాగ్ టూర్‌కు వెళ్లానని తండ్రికి చెప్పి ఇంటి వెనకాల ఉండే మరో ప్రియుడితో గడిపింది. తండ్రి శ్రీనావాస్ రెడ్డి కూతుర్ని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తండ్రి శ్రీనివాసరెడ్డి సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.

అయితే, తల్లి హత్య అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కీర్తి తండ్రి శ్రీనివాసరెడ్డిపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిత్యం తాగి రావడంతోపాటు తల్లితో గొడవపడేవాడని ఫిర్యాదు చేసింది. అయితే, కీర్తి ప్లాన్ ఫెయిల్ కావడంతో కటకటాలపాలైంది. పోలీసుల విచారణలో తానే ప్రియుడితో కలిసి తల్లి రజితను చంపినట్లు కీర్తి అంగీకరించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories