శ్రీశైలం అడవుల్లో తల్లీకొడుకుల ఆత్మహత్య!

శ్రీశైలం అడవుల్లో తల్లీకొడుకుల ఆత్మహత్య!
x
Highlights

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం సమీప అడవుల్లో విషాదం చోటుచేసుకుంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ మహిళ ఆ వ్యాధి నయం కాదని భావించి మరణమే శరణ్యమనుకుంది....

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం సమీప అడవుల్లో విషాదం చోటుచేసుకుంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ మహిళ ఆ వ్యాధి నయం కాదని భావించి మరణమే శరణ్యమనుకుంది. తల్లిలేని లోకంలో తానుండలేనంటూ కుమారుడు సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వారి కుటుంబంలో విషాదం నింపింది. సూర్యాపేటకు చెందిన చిత్రం మాధవి(34) రెండేళ్లుగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతోంది. హైదరాబాద్‌లోనూ చికిత్స పొందింది. వ్యాధి నయం కాదని భావించిన ఆమె చనిపోవాలని నిర్ణయించుకుంది. కొడుకు కార్తీక్‌(18)తో కలిసి ఆరు రోజుల క్రితం శ్రీశైలానికి వచ్చింది. తల్లీ కొడుకులు ఇద్దరూ సాక్షిగణపతి ఆలయ సమీపంలోని అడవుల్లోకి వెళ్లారు. వెంట తెచ్చుకున్న పురుగుల మందు, కొన్ని మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో శుక్రవారం మృతదేహాలు ఉన్న ప్రదేశాన్ని పోలీసులు గుర్తించారు. శ్రీశైలం ఎస్సై తిమ్మయ్య, రెండో పట్టణ ఎస్సై మహబూబ్‌బాబా మృతదేహాలను పరిశీలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories