జవాన్ల వాహనాన్ని పేల్చేసిన మావోలు.. 15మంది మృతి

జవాన్ల వాహనాన్ని పేల్చేసిన మావోలు.. 15మంది మృతి
x
Highlights

మహారాష్ట్రలో మావోలు దారుణానికి పాల్పడ్డారు. గడ్చిరోలి జిల్లాలో జవాన్‌ల వాహనాన్ని పేల్చేశారు. జవాన్‌లు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీ మందుపాతర పెట్టి...

మహారాష్ట్రలో మావోలు దారుణానికి పాల్పడ్డారు. గడ్చిరోలి జిల్లాలో జవాన్‌ల వాహనాన్ని పేల్చేశారు. జవాన్‌లు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీ మందుపాతర పెట్టి మావోలు పేల్చేశారు. ఈ ఘటన మహారాష్ట్రాలోని గడ్చిరోలిలో బుధవారం చోటుచేసుకుంది. భారీ విస్పోటనం కారణంగా వాహనం తునాతునకలైంది. ఈ ప్రమాదంలో 15 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. జాంబిర్‌కేడ అటవీ ప్రాంతం గుండా వెళ్తున్న క్రమంలో ఈ దారుణం జరిగింది. పేలుడు అనంతరం నక్సల్‌ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో ఎన్‌కౌంటర్‌ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories