జగిత్యాలలో దారుణం...

జగిత్యాలలో దారుణం...
x
Highlights

జగిత్యాలలో దారుణం జరిగింది. జగిత్యాల సార్గమ్మవీధిలో అందరూ చూస్తుండగానే ఓ యువకుడు గొడ్డలితో దాడికి తెగబడ్డాడు. భూమి తగాదాతో బ్రోకర్ కిషన్‌‌పై బాధితుడు...

జగిత్యాలలో దారుణం జరిగింది. జగిత్యాల సార్గమ్మవీధిలో అందరూ చూస్తుండగానే ఓ యువకుడు గొడ్డలితో దాడికి తెగబడ్డాడు. భూమి తగాదాతో బ్రోకర్ కిషన్‌‌పై బాధితుడు లక్ష్మణ్ దాడికి దిగాడు. భూమి కొనుగోలులో కిషన్ తనను మోసం చేశాడని కొన్నేళ్లుగా లక్ష్మణ్ గొడవపడుతున్నాడు. అయితే భూమికి సంబంధించిన సమస్యను పరిష్కరిస్తానని కిషన్ హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా గొడవ సద్దుమణిగింది. కానీ ఐదేళ్లుగా భూ తగాదా తేలకపోవడంతో కిషన్‌పై కక్ష పెంచుకున్న లక్ష్మణ్ దాడికి దిగాడు. మాట్లాడాలని పిలిచి ఒక్కసారిగా గొడ్డలితో విరుచుకుపడ్డాడు. ఈ దాడి దృశ్యాలు సీసీటీవీ రికార్డయ్యాయి. అంతేకాదు దాడి చేస్తున్న సమయంలో చుట్టూ జనమున్నా ఆపేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. దాడి చేసిన లక్ష్మణ్‌ తీరిగ్గా తన బైక్‌ ఎక్కి వెళ్లిపోయాక కిషన్‌‌ను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ప్రస్తుతం కిషన్ పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories