గుంటూరు జిల్లాలో దారుణం...కత్తితో భార్య, అత్తమామలపై దాడి

గుంటూరు జిల్లాలో దారుణం...కత్తితో భార్య, అత్తమామలపై దాడి
x
Highlights

గుంటూరు జిల్లా దారుణం జరిగింది. చెరుకుపల్లి మండలం గుళ్లపల్లిలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్య, అత్త, మామలపై విచక్షణారహితంగా కత్తితో దాడి...

గుంటూరు జిల్లా దారుణం జరిగింది. చెరుకుపల్లి మండలం గుళ్లపల్లిలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్య, అత్త, మామలపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఇంట్లో నిద్రిస్తున్న వారిపై కత్తితో నరకడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. తల, మెడపై విచక్షణా రహితంగా నరకడంతో తీవ్రగాయాలయ్యాయి. రక్తం కారుతూ మామ రామకృష్ణ ఇంటి నుంచి బయటకు వచ్చి కేకలు వేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల రాకను గమనించిన వెంకట్రావు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భార్య అనిత పరిస్థితి విషమంగా ఉండగా, అత్త మంగమ్మ కోమాలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తన అల్లుడితో పాటు మరో ఇద్దరు ఈ దాడికి పాల్పడినట్లు మామ రామకృష్ణ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories