అత్తారింట్లో అల్లుడి ఘాతుకం.. ఐదుగురిపై పెట్రోల్‌ పోసి నిప్పు

అత్తారింట్లో అల్లుడి ఘాతుకం.. ఐదుగురిపై పెట్రోల్‌ పోసి నిప్పు
x
ఖమ్మంపల్లి
Highlights

సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలు, భార్య, భార్య సోదరుడు, సోదరి ఇలా మొత్తం ఐదుగురిపై పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. ఈ...

సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలు, భార్య, భార్య సోదరుడు, సోదరి ఇలా మొత్తం ఐదుగురిపై పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. ఈ దారుణ ఘటన కొండపాక మండలం ఖమ్మంపల్లిలో జరిగింది.

శుక్రవారం తెల్లవారుజామున అత్తారింట్లో కుటుంబ సభ్యులంతా ఇంట్లో నిద్రిస్తుండగా అల్లుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితులను తొలుత సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితులను విమల, ఆమె సోదరుడు రాజు, సోదరి సునీతగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories