ఖమ్మం జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం

ఖమ్మం జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం
x
Highlights

ఖమ్మం జిల్లాలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తాను ప్రేమించిన యువతి మరొకరితో చనువుగా ఉంటోందనే అనుమానంతో ఓ యువతిని హత్య చేశాడు.

ఖమ్మం జిల్లాలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తాను ప్రేమించిన యువతి మరొకరితో చనువుగా ఉంటోందనే అనుమానంతో ఓ యువతిని హత్య చేశాడు. పెనుబల్లి మండలం కూపెనకుంట్ల గ్రామానికి చెందిన తేజస్విని, నితిన్ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే తేజస్విని వేరే వ్యక్తితో చనువుగా ఉంటోందని నితిన్ అనుమానం పెంచుకున్నాడు. ఆదివారం పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామానికి తేజస్వినిని బైక్‌పై తీసుకువచ్చాడు నితిన్. అయితే అక్కడ కూడా ప్రేమ వ్యవహారం మీద ఇద్దరు గొడవపడ్డారు. ఈ నేపథ్యంలోనే తేజస్వినిని హత్య చేసిన అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. రెండు రోజులుగా తేజస్విని కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తలంకపల్లి గుట్టల్లో యువతి మృతదేహాన్ని గుర్తించారు. మరోవైపు హత్య చేసిన నితిన్ పోలీసులకు లొంగిపోయాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories