వరంగల్ లో ప్రాణం తీసిన శాడిస్ట్

వరంగల్ లో ప్రాణం తీసిన శాడిస్ట్
x
వరంగల్ లో ప్రాణం తీసిన శాడిస్ట్
Highlights

వరంగల్ జిల్లా హన్మకొండలో దారుణం జరిగింది. ఉన్మాదిలా మారిన ఓ యువకుడు యువతి గొంతు కోసి చంపాడు. యువతిని గదిలోకి పిలిపించుకొని ఈ దారుణానికి ఒడిగట్టాడు....

వరంగల్ జిల్లా హన్మకొండలో దారుణం జరిగింది. ఉన్మాదిలా మారిన ఓ యువకుడు యువతి గొంతు కోసి చంపాడు. యువతిని గదిలోకి పిలిపించుకొని ఈ దారుణానికి ఒడిగట్టాడు. ప్రేమోన్మాది ఘాతుకానికి మరో యువతి బలైంది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. ఉన్మాదిగా మారిన ఓ యువకుడు 20 ఏళ్ల ఓ యువతిని గొంతు కోసి చంపేశాడు. బాధితురాలిని తన గదిలోకి రప్పించుకొని ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం జడ్జి ముందు లొంగిపోయాడు. న్యాయమూర్తి అతడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని కాజీపేటకు చెందిన షాహిద్‌గా గుర్తించారు. హన్మకొండలోని రామ్‌నగర్‌లో శుక్రవారం సాయంత్రం ఈ దారుణం జరిగింది.

ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. బాధితురాలు శుక్రవారం సాయంత్రం కాలేజీ ముగిసిన అనంతరం నిందితుడు షాహిద్ గదికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన యువకుడు ఉన్మాదిలా మారి బ్లేడుతో యువతిని అతి దారుణంగా గొంతు కోసి హతమార్చినట్లు తెలుస్తోంది.

బాధితురాలు, షాహీద్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. యువతి మరొకరితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో షాహిద్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. హత్య జరిగిన ఘటనా స్థలాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌, చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌ పరిశీలించి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. యువతి కుటుంబానికి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని ఎర్రబెల్లి హామీ ఇచ్చారు.

యువతి డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. మధ్యాహ్నం 12 గంటలకు బయటకు వెళ్తున్నానని చెప్పి కానరానిలోకాలకు వెళ్లిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories