గుండాయిజం చూపించిన లెక్చరర్... క్లాస్ రూమ్ లోనే చితకబాదాడు

గుండాయిజం చూపించిన లెక్చరర్... క్లాస్ రూమ్ లోనే చితకబాదాడు
x
Highlights

విధ్యార్ది అని చూడకుండా ఓ వీధి రౌడీలాగా ప్రవర్తించాడు. ఓ లెక్చరర్... ఏకంగా క్లాస్ రూమ్ లోనే అందరి విద్యార్ధుల ముందే చితకబాదాడు. విద్యార్థిని కాలితో...

విధ్యార్ది అని చూడకుండా ఓ వీధి రౌడీలాగా ప్రవర్తించాడు. ఓ లెక్చరర్... ఏకంగా క్లాస్ రూమ్ లోనే అందరి విద్యార్ధుల ముందే చితకబాదాడు. విద్యార్థిని కాలితో తన్నాడు. దీనిని అడ్డుకోబోయిన మరో విద్యార్ధిపై చేయిజేసుకున్నాడు . అదేదో అతనిపై కక్ష ఉన్న వ్యక్తిగా విచక్షణారహితంగా ప్రవర్తించాడు . ఈ ఘటన జగిత్యాల జిల్లాలోని శాంతి జూనియర్ కాలేజ్‌లో చోటు చేసుకుంది . అ లెక్చరర్ చేసిన ఘనకార్యం మొత్తం సీసీ కెమరాలో బందీ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది . కాలేజీలో నిర్వహించే ఫ్రేషర్స్ పార్టీ గురించి చెప్పేందుకు సిద్ధిరాజ్ అనే లెక్చరర్ ఇంటర్ సీఈసీ ఫస్టియర్‌‌ రూమ్ లోకి వచ్చాడు .

ఈ క్రమంలో గుగ్గిళ్ల మనోజ్‌ అనే విద్యార్థి సార్ టైమ్ అయింది.. మేం వెళ్తామని అన్నాడు . దీనితో అయన కోపం కట్టలు తెంచుకుంది . లాస్ట్ బెంచ్ లో కూర్చున్న అతని దగ్గరికి వెళ్లి విచక్షణారహితంగా కొట్టాడు . ఇది చుసిన తోటి విద్యార్ధులు షాక్ కి గురి కావాల్సి వచ్చింది . అయితే విషయం బయటకు రావడంతో విద్యార్ధి సంఘాలు , మనోజ్ తల్లితండ్రులు కాలేజే యాజమాన్యంపై , లెక్చరర్ పై ఆందోళన చేపట్టారు .అతనిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు . లెక్చరర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories