నెల్లూరులో క్షుద్రపూజల కలకలం...రూ.8లక్షలకు డీల్‌ కుదుర్చుకున్న...

నెల్లూరులో క్షుద్రపూజల కలకలం...రూ.8లక్షలకు డీల్‌ కుదుర్చుకున్న...
x
Highlights

నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం పెట్లూరులో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. చనిపోయిన వ్యక్తి బతికి వస్తాడనే మూఢ నమ్మకంతో స్మశానంలో 40రోజులుగా...

నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం పెట్లూరులో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. చనిపోయిన వ్యక్తి బతికి వస్తాడనే మూఢ నమ్మకంతో స్మశానంలో 40రోజులుగా క్షుద్రపూజలు చేస్తున్నారు. 40రోజుల క్రితం ఓ వ్యక్తి డెంగ్యూ జ్వరంతో మరణించగా, చేతబడి చేసి చంపేశారని అతని కుటుంబ సభ్యులు నమ్ముతున్నారు. అయితే 41రోజుల తర్వాత తిరిగి బతికిస్తానని, సమాధి నుంచి పైకి లేపుతానని, నమ్మబలికిన క్షుద్రపూజారి 8లక్షలకు డీల్‌ కుదుర్చుకున్నాడు. దాంతో 40రోజులుగా సమాధి దగ్గర క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారు. క్షుద్రపూజారి మాటలు నమ్మి 40రోజులుగా స్మశానంలోనే వండుకుని తింటున్న మృతుని కుటుంబ సభ్యులు సమాధి వైపు గ్రామస్తులు రాకుండా కత్తులు, కర్రలతో కాపలా కాస్తున్నారు. దాంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories