ఫోన్ పోయిందని ఫోన్ల దొంగతనాలు చేసాడు ... చివరికి

ఫోన్ పోయిందని ఫోన్ల దొంగతనాలు చేసాడు ... చివరికి
x
Highlights

వరుసగా దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ గా మారినా నేరస్థుల ముఠాని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసారు .. ముఠా లోని నేరస్థులు దగ్గర 23 లక్షలు స్వాదినం...

వరుసగా దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ గా మారినా నేరస్థుల ముఠాని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసారు .. ముఠా లోని నేరస్థులు దగ్గర 23 లక్షలు స్వాదినం చేసుకున్నారు . కమిషనరేట్ కేంద్రంలో పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు . పోలీస్ కమిషనర్ చెప్పిన వివరాల ప్రకారం కాకినాడకి చెందినా ఓ బాలుడు(17) కూలి పనికి వెళ్ళినప్పుడు తన దగ్గర ఉన్న ఫోన్ ని ఎవరో దొంగతనం చేసారు . దీనితో చాలా విరక్తి చెందినా అ బాలుడు ఫోన్ దొంగతనాలకు ఎగబడ్డాడు .. యుట్యుబ్ లో దొంగతనం ఎలా చేయాలో తెలుసుకున్నాడు . ఇలా ఫోన్ల దొంగతనం కాస్తా మరిన్ని దొంగతనాలకు దారి తీసింది . పలుమార్లు దొంగతనం కేసులో అరెస్ట్ అయి బయటకు వచ్చినా అతని వైఖరి మారలేదు .

మరికొందరు సహాయంతో మరిన్ని దొంగతనాలకు అలవాటుపడ్డాడు . ఇందులో హన్మకొండకి చెందినా రంజిత్ (38) , హుస్నాబాద్ కి చెందినా కందారపు సాయి వర్మ(19) , ఎల్వకా సాయిరాం (19), విలసాగారం రజీనికాంత్(19), ముల్కనూర్ కి చెందినా రాజు (26) ఉన్నారు . వీరందరూ ఓ ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేయడం మొదలు పెట్టారు . పగలంతా ఇంటికి రెక్కి నిర్వహించి రాత్రి దొంగతనాలకు పాల్పడి అ తర్వాత ఇంట్లో కారంపొడి చల్లి పారిపోతారు . అయితే అ చుట్టుపక్కల ఇలాంటి దొంగతనాలు ఎక్కువ కావడంతో పోలిస్ సిబ్బంది దీనిపైన ప్రత్యేక ద్రుష్టి పెట్టింది . సాంకేతిక పరికరాలతో వారిని పట్టుకొని అరెస్ట్ చేసారు . వారిని పట్టుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఎస్సైలకు అభినందనలు తెలిపారు కమిషనర్

Show Full Article
Print Article
More On
Next Story
More Stories