చిక్కడపల్లి గజేంద్రప్రసాద్ కిడ్నాప్ కేసులో కొత్త మలుపు.

చిక్కడపల్లి గజేంద్రప్రసాద్ కిడ్నాప్ కేసులో కొత్త మలుపు.
x
Highlights

నిన్న అర్ధరాత్రి చిక్కడపల్లిలో వ్యాపారి గజేంద్రప్రసాద్ కిడ్నాప్ కథలో పోలీసులు కొత్త విషయాలు బయటపెట్టారు. పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం...

నిన్న అర్ధరాత్రి చిక్కడపల్లిలో వ్యాపారి గజేంద్రప్రసాద్ కిడ్నాప్ కథలో పోలీసులు కొత్త విషయాలు బయటపెట్టారు. పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం వ్యాపారవేత్త గజేంద్ర ప్రసాద్‌ కిడ్నాప్‌ వ్యవహారం.. హైడ్రామాగా భావిస్తున్నారు పోలీసులు. గజేంద్రప్రసాద్‌కు ముంబై వ్యాపారవేత్తలతో విభేదాలున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే గతంలో 23 కోట్ల వ్యవహారానికి సంబంధించి.. ముంబైకి చెందని కంపెనీ లావాదేవీల్లో గజేంద్ర ప్రసాద్‌ అన్నను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా.. గజేంద్రప్రసాద్‌తో మరికొందరితో కలిసి.. ముంబైకి చెందిన కంపెనీని మోసంగించిన ఘటనలో పలు కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో గజేంద్రప్రసాద్ కిడ్నాప్‌ను హైడ్రామాగా భావిస్తున్నారు. దీంతో గజేంద్ర ప్రసాద్‌ స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన పోలీసులు... అసలు కిడ్నాప్‌ జరిగిందా లేదా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories