ప్రాణం తీసిన అనుమానం.. చపాతి కర్రతో భార్యను కొట్టి చంపిన భర్త

ప్రాణం తీసిన అనుమానం.. చపాతి కర్రతో భార్యను కొట్టి చంపిన భర్త
x
Highlights

భార్యపై పెరిగిన అనుమానం పెనుభూతంగా మారింది. చివరికి ఆ అనుమానమే భర్తను హంతకుడిగా మార్చింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. కనిగిరి జవహర్‌లాల్‌ వీధిలో...

భార్యపై పెరిగిన అనుమానం పెనుభూతంగా మారింది. చివరికి ఆ అనుమానమే భర్తను హంతకుడిగా మార్చింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. కనిగిరి జవహర్‌లాల్‌ వీధిలో గతనెల 27న ఫాతిమా అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ మృతి వెనుక గల కారణాలను పోలీసులు ఛేదించారు. భర్తే భార్య ప్రాణాలు తీసినట్టు గుర్తించారు.

కనిగిరి మండలం తాళ్లూరుకు చెందిన చిన పాచ్చూ అనే వ్యక్తితో 14 ఏళ్ల క్రితం ఫాతిమా వివాహం జరిగింది. ఆమె భర్త పాల వ్యాపారంతో పాటూ టైలరింగ్ చేసేవాడు. నాలుగేళ్ల క్రితం కనిగిరిలోని జవహర్‌లాల్ వీధిలో ఓ ఇళ్లు అద్దెకు తీసుకుని ఫ్యామిలీ పెట్టారు. ఇద్దరు పిల్లలతో జీవితం చక్కగా సాగిపోతోంది. అదే సమయంలో ఫాతిమాపై చినపాచ్చూ అనుమానం పెంచుకున్నాడు. ఫాతిమా మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని అనుమానం పెంచుకుని రోజూ భార్యతో గొడవపడేవాడు.

ఫాతిమా టిక్ టాక్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేసేది. అది కూడా భర్తకు నచ్చేది కాదు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు జరిగేవి. గత నెల 27వ ఫాతిమా దంపతుల మధ్య ఘర్షణ జరుగగా, ఇంట్లో ఉన్న చపాతి కర్రతో భర్త భార్య తలపై కొట్టాడు. అంతటితో ఆగకుండా చపాతి కర్రతో గొంతు నులిమి చంపేశాడు. ఫాతిమా చినిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఇంట్లో ఫ్యాన్‌కి ఫాతిమా చీర కట్టి ఆమె ఆత్మహత్య చేసుకుందని అందరిని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే మృతురాలు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో చినపొచ్చు చేసిన నేరం అంగీకరించాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories