దారుణం : భార్యకు సైనేడ్‌ ఇచ్చి హత్య చేసిన భర్త !

దారుణం : భార్యకు సైనేడ్‌ ఇచ్చి హత్య చేసిన భర్త !
x
దారుణం : భార్యకు సైనేడ్‌ ఇచ్చి హత్య చేసిన భర్త !
Highlights

గత నెల 27వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన వివాహిత ఆమని మృతి కేసును పోలీసులు ఛేదించారు. కృష్ణా జిల్లాకు...

గత నెల 27వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన వివాహిత ఆమని మృతి కేసును పోలీసులు ఛేదించారు. కృష్ణా జిల్లాకు చెందిన లక్ష్మీదేవి, జోగినాయుడు కుమార్తె ఆమనిని మదనపల్లెలో బ్యాంక్‌ ఆఫ్ బరోడా మేనేజర్‌గా పని చేస్తున్న రవిచైతన్యతో వివాహం జరిపించారు.

గత నెల 27వ తేదీన ఆమని స్పృహ తప్పి పడిపోయిందని ఆమె భర్త రవిచైతన్య ఆమనిని జిల్లా ఆసుపత్రికి తరలించాడు. అయితే చికిత్స పొందుతూ ఆమన మృతి చెందింది. తమ కుమార్తెను రవిచైతన్య, వారి తల్లిదండ్రులు హత్య చేశారని ఆమని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమని మృతదేహాన్ని పోస్టుమార్టం చేయగా అమనికి సైనేడ్ ఇచ్చినట్లు నిర్ధారణ కావటంతో పోలీసులు రవిచైతన్యను, తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories