ఆ కారణంతోనే భార్య, కొడుకును హత్య..

ఆ కారణంతోనే భార్య, కొడుకును హత్య..
x
Highlights

గతవారం హైదరాబాద్ ఉప్పల్ లో భార్య, కొడుకును దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడు హత్యకు గల కారణాలను పోలీసులకు వెల్లడించాడు. ఓ పథకం ప్రకారం కుట్ర చేసి...

గతవారం హైదరాబాద్ ఉప్పల్ లో భార్య, కొడుకును దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడు హత్యకు గల కారణాలను పోలీసులకు వెల్లడించాడు. ఓ పథకం ప్రకారం కుట్ర చేసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. భార్య గర్భవతి అని చెప్పటంతో అనుమానం పెంచుకున్నాడు రమేష్. అయితే అంతకుముందే తన కొడుకు నామకరణానికి అత్తారింటికి పిలిచి అవమానించారని.. ‌తన కుటుంబ సభ్యుల్లో చులకనవ్వటానికి భార్య సుశ్రుతే కారణమని కోపం పెంచుకున్నాని రమేష్ వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ కారణాలతో భార్య, కొడుకును హత్య చేసి సాక్ష్యాలు దొరక్కుండా మృతదేహాలను తగలబెట్టినట్టు రమేష్ ఒప్పుకున్నట్టు సమాచారం. కాగా జనగామ జిల్లా గూడూరుకు చెందిన రమేశ్‌..

2015లో సుశ్రుతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి కులాలు వేరు కావటంతో రమేశ్‌ కుటుంబ సభ్యులకు పెళ్లి నచ్చలేదు. అటు.. భార్యతో తరచు గొడవపడే వాడు రమేశ్‌. గొడవలు ముదరటంతో ఎనిమిది నెలలుగా వేర్వేరుగా ఉంటున్నారు. విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు.అప్పటినుంచి దంపతుల మధ్య వివాదాలు రేగినట్టు తెలుస్తోంది. దీంతో భార్యపై కోపం పెంచుకున్న రమేష్ ఓ పథకం ప్రకారం కలిసి ఉందామని ఉప్పల్‌ రప్పించి తల్లి కొడుకులను హత్య చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories