మద్యం మత్తులో ఇద్దరు యువకులు హల్ చల్.. ఓ మహిళ మృతి

మద్యం మత్తులో ఇద్దరు యువకులు హల్ చల్.. ఓ మహిళ మృతి
x
Highlights

మేడ్చల్ కొంపల్లి జాతీయ రహదారి పై మద్యం మత్తులో ఇద్దరు యువకులు హల్ చల్ చేశారు. ఇన్నోవా కారును స్పీడ్ గా నడుపుతూ ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీ కొట్టారు....

మేడ్చల్ కొంపల్లి జాతీయ రహదారి పై మద్యం మత్తులో ఇద్దరు యువకులు హల్ చల్ చేశారు. ఇన్నోవా కారును స్పీడ్ గా నడుపుతూ ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీ కొట్టారు. ఆ తర్వాత నాలుగు వాహనాలను ఢీ కొట్టారు. స్కూటీని ఢీ కొట్టిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, బాలుడికి గాయాలయ్యాయి.

మేడ్చల్ కొంపల్లి జాతీయ రహదారి పై మద్యం మత్తులో ఇద్దరు యువకులు ఇన్నోవా కారును స్పీడ్ గా నడిపిస్తూ ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ఓ మహిళతో పాటు బాలుడికి గాయాలయ్యాయి. వీరికి సమీపంలోని ఆసుపత్రికి స్థానికులు తరలించారు. చికిత్స పొందుతూ మహిళ మృతి చెందగా, బాలుడికి చికిత్స కొనసాగుతోంది. మృతురాలిని దూలపల్లిగా చెందిన శ్రీదేవిగా గుర్తించారు. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ లో ఆమె పనిచేస్తుంది. సెప్టెంబర్ 2 వతేదీన శ్రీదేవి పుట్టిన రోజు. బర్త్ డే షాపింగ్ కోసం ఆమె తన అన్న కొడుకుతో కలిసి స్కూటీపై వెళుతుండగా ఇన్నోవా కారు ఢీ కొట్టింది.

స్కూటీని ఢీ కొట్టి తర్వాత మద్యంమత్తులో ఉన్న యువకులు కారును అడ్డదిడ్డంగా నడిపించారు. నాలుగు వాహనాలను ఢీ కొట్టారు. వాహనాలు నడిపిస్తున్నవారికి స్వల్ప గాయాలయ్యాయి. ఐదు వాహనాలను ఢీ కొట్టిన తర్వాత తేరుకున్న యువకులు దారి మధ్యలో కారును వదిలి పారిపోయారు. ఇన్నోవా కారు నెంబర్ AP 09 CM 4366గా వుంది. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. మద్యంమత్తులో ఇన్నోవా కారు నడిపిన యువకులు ఉన్నత కుటుంబానికి చెందినవారిగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories