కీర్తి ది కిల్లర్.. మరో ప్రియుడు బాల్‌రెడ్డిపై అత్యాచారం కేసు నమోదు

కీర్తి ది కిల్లర్.. మరో ప్రియుడు బాల్‌రెడ్డిపై అత్యాచారం కేసు నమోదు
x
Highlights

పేగు బంధాన్ని తృణప్రాయంగా హతమార్చింది ఆ కసాయి కూతురు. నవమాసాలు మోసి కని, పెంచి పెద్ద చేసి అల్లారుముద్దుగా ఆలనాపాలనా చూసిన కన్న తల్లినే స్వహస్తాలతో...

పేగు బంధాన్ని తృణప్రాయంగా హతమార్చింది ఆ కసాయి కూతురు. నవమాసాలు మోసి కని, పెంచి పెద్ద చేసి అల్లారుముద్దుగా ఆలనాపాలనా చూసిన కన్న తల్లినే స్వహస్తాలతో నులిమేశాయి ఆ పాశవిక చేతులు. యావత్‌ లోకాన్ని కలచివేసిన ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. చేసిన తప్పును కప్పిపుచ్చుకునే క్రమంలో ఈ ఘోరం జరిగిపోయినట్టు సమాచారం.

తల్లిని పాశవికంగా హత్య చేసిన కీర్తి ఉదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో కీర్తితో పాటు ఆమె ప్రియుడు శశికుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మరో ప్రియుడు బాల్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని అత్యాచారం కేసు నమోదు చేశారు.

జనవరిలో కీర్తిని బాల్‌రెడ్డి అత్యాచారం చేయడంతో గర్భం దాల్చింది. అయితే స్నేహితుడు శశి సహకారంతో బాల్‌‌రెడ్డి కీర్తికి అబార్షన్‌ చేయించాడు. దీన్ని అడ్డంపెట్టుకున్న శశి కొంతకాలంగా కీర్తిని శారీరకంగా వాడుకుంటూ వీడియోలు తీశాడు. ఈ క్రమంలో బాల్‌రెడ్డి-కీర్తి పెళ్లికి ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. మరోవైపు కొద్దిరోజులుగా కీర్తి శశితో చనువుగా ఉంటడం గమనించిన తల్లి రజిత ఆమెను మందలించింది. ఈ విషయాన్ని కీర్తి శశికి చెప్పింది. దీంతో రజితను చంపకపోతే వీడియోలు బయటపెడతానంటూ శశి కీర్తిని బెదిరించాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి రజితను పథకం ప్రకారం హత్య చేశారు.

ఈనెల 19న కీర్తి తల్లి రజిత కూరగాయలు తెచ్చేందుకు మార్కెట్‌కు వెళ్లిన సమయంలో శశి వాళ్లింటికి వచ్చాడు. ఆమె తిరిగి వచ్చేసరికి శశితో కీర్తి కలిసి ఉండటం గమనించిన రజిత వాళ్లిద్దరినీ మందలించింది. ఈ నేపథ్యంలో బయటకు వచ్చిన శశి రజిత అడ్డు తొలగించుకుంటేనే తామిద్దరం కలిసి ఉండవచ్చని కీర్తికి చెప్పాడు. బీర్‌ బాటిల్స్‌తో కీర్తి ఇంటికి వచ్చాడు శశి. కీర్తి తల్లి రజిత లోపల గదిలో ఉండగా ఇంటి ఆవరణలోనే కీర్తికి శశి మద్యం తాగించి రజితను హత్య చేసేలా ప్రేరేపించాడు. తర్వాత ఇద్దరూ ఇంట్లోకి వెళ్లగా శశి లోపలి నుంచి తలుపు గడియ వేశాడు. పథకం ప్రకారం తల్లి అరవకుండా కీర్తి ఆమె ముఖంపై దిండుతో నొక్కగా శశి చున్నీతో రజిత గొంతు నులిమి హత్య చేశాడు.

రజితను హతమార్చి శశి, కీర్తి.. ఆమె ఉరివేసుకున్నట్టుగా అందరినీ నమ్మించారు. అనంతరం మూడు రోజుల పాటు శవాన్ని అక్కడే పెట్టుకుని గడిపారు. మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో యాదాద్రి జిల్లా రామన్నపేట రైల్వేగేట్‌ వద్ద పడేసి ఇంటికి చేరుకున్నారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన విషయాలు పోలీసులు వెల్లడించారు. కీర్తి ఇంట్లో నుంచి మూడు బీర్ బాటిల్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ హత్యలో ఇంకా ఎవరి హస్తమైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories