ప్రియురాలిని చంపి.. ప్రియుడి ఆత్మహత్య అనాథలైన పిల్లలు...

ప్రియురాలిని చంపి.. ప్రియుడి ఆత్మహత్య అనాథలైన పిల్లలు...
x
Highlights

వారిద్దరిరి వివాహేతర సంబంధం .. అంతలోనే వివాహేతర సంబంధం కాస్తా అనుమానంగా మారింది .. అ అనుమానం కాస్తా పెనుభూతంగా మారి ఇద్దరు ప్రాణాలను కోల్పోయేలా చేసింది . వీరిద్వారా వారి ఇరు కుటుంబాల పిల్లలును అనాధులను చేసింది .

వారిద్దరిరి వివాహేతర సంబంధం .. అంతలోనే వివాహేతర సంబంధం కాస్తా అనుమానంగా మారింది .. అ అనుమానం కాస్తా పెనుభూతంగా మారి ఇద్దరు ప్రాణాలను కోల్పోయేలా చేసింది . వీరిద్వారా వారి ఇరు కుటుంబాల పిల్లలును అనాధులను చేసింది . ఇక వివరాల్లోకి వెళ్తే ఈ ఘటన గురువారం చిత్తూరులో చోటు చేసుకుంది . పోలిసుల సమాచారం ప్రకారం స్థానికంగా ఉండే గీతారాణి (38)కి ఓ ఆర్మీ ఉద్యోగితో వివాహం జరిగింది . వీరికి ఇద్దరు ఆడపిల్లలు .. అయితే గీత భర్త ఉద్యోగ రీత్యా వేరే రాష్ట్రంలో ఉండడం చేత అదే ప్రాంతానికి చెందిన హమీద్‌ (36) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది .

అ పరిచయం కాస్తా ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది . అయితే ఈ విషయం తెలుసుకున్నా గీతా భర్త మరియు హమీద్‌ భార్య తమ కుమారున్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు . దీనితో హమీద్‌ , గీతారాణి కలిసే ఉంటున్నారు . ఈ నేపధ్యంలో గీతాపై అనుమానం పెంచుకున్న హమీద్‌ ఆమె ఒంటరిగా ఉన్న సమయం చూసి ఆమెను ఇంట్లో కత్తితో దాడి చేసి పారిపోయాడు .. దీనితో ఆమె కేకలు వేసుకుంటూ రక్తపు మడుగులతో బయటకు వచ్చింది . పక్కన వారు ఆమెను ఆసుపత్రికి తరలించారు కానీ ఆమె అప్పటికే చనిపోయినట్టు వైద్యులు చెప్పారు .

ఇంతలోనే మరో ట్విస్ట్ ...

ఇది ఇలా ఉంటే దుర్గానగర్‌ కాలనీ సమీపంలోని అటవీ ప్రాంతంలో హమీద్‌ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు . స్థానికంగా విషయం తెలుసుకున్న కొందరు అతన్ని ఆసుపత్రికి తరలించారు . కానీ అతను మార్గమధ్యంలో చనిపోయాడు . దీనితో అక్కడికి చేరుకున్న పోలీసులు వివరాలని తెలుసుకొని కేసు నమోదు చేసారు ... గీతా హత్య, హమీద్ ఆత్మహత్య వలన వీరి ఇరువురు కుటుంబానికి చెందినా పిల్లలు అనాధలుగా ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories