హార్సిలీహిల్స్‌లో యువతిపై అత్యాచారయత్నం!

హార్సిలీహిల్స్‌లో యువతిపై అత్యాచారయత్నం!
x
Highlights

చిత్తూరు జిల్లాలోని పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌లో సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగు చేసింది. గంగోత్రి చెరువు సమీపంలో ఓ యువతిపై అటవీశాఖ సిబ్బంది అత్యాచారానికి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది.

చిత్తూరు జిల్లాలోని పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌లో సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగు చేసింది. గంగోత్రి చెరువు సమీపంలో ఓ యువతిపై అటవీశాఖ సిబ్బంది అత్యాచారానికి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఓ యువజంట హార్సిలీహిల్స్‌కు వచ్చింది. గంగోత్రి చెరువు వద్ద అల్పాహారం చేస్తుండగా అటుగా వచ్చిన ఇద్దరు అటవీశాఖ సిబ్బంది వారిపై వీడియోలు తీసారు. వీడియోలను అడ్డుపెట్టుకుని బెదిరించి వారి దగ్గర ఉన్న డబ్బులు, బంగారు లాక్కొన్నారు. అనంతరం యువతిపై అత్యాచారానికి ప్రయత్నించినట్లు సమాచారం. హార్సిలీహిల్స్‌లో అటవీశాఖ అధికారులు చేసిన దాష్టీకాన్ని గురించి తమకు తెలిసిన యువకులకు తెలియజేశారు ప్రేమికులు. వెంటనే స్పందించిన యువకులు బాధిత యువతితో కలసి హిల్స్‌లోని అటవీశాఖ క్యాంప్‌ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి అకృత్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories