నటిని దారుణంగా హత్యచేసి ముక్కలుగాచేసి, చెత్తకుప్పలో పడేసిన భర్త

నటిని దారుణంగా హత్యచేసి ముక్కలుగాచేసి, చెత్తకుప్పలో పడేసిన భర్త
x
Highlights

భర్త చేతిలో తమిళ నటి దారుణహత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నటిని హత్యచేసి, ముక్కలుగా నరికి వేర్వేరు ప్రదేశాల్లో పడేశాడు. ఆమె మరొకరితో వివాహేతర...

భర్త చేతిలో తమిళ నటి దారుణహత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నటిని హత్యచేసి, ముక్కలుగా నరికి వేర్వేరు ప్రదేశాల్లో పడేశాడు. ఆమె మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే దీనికి కారణం. చెన్నై శివారులో జరిగిన ఈ ఘటనలో రెండు వారాల తర్వాత నిందితుడు పోలీసులకు చిక్కాడు. జనవరి 21న పళ్లికరనైయ్ డంపింగ్ యార్డ్‌లో గుర్తుతెలియని ఓ మహిళకు చెందిన కాళ్లు, చేయి బయటపడ్డాయి. ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, వారు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఎవరనేది గుర్తించడానికి పోలీసులు విశ్వప్రయత్నాలు చేయగా, ఆమె చేతిపై పచ్చబొట్టు ఆధారంగా చివరికి తూత్తుకూడికి చెందిన సంధ్యగా గుర్తించారు. ఆమె చెన్నైలోని జఫర్‌ఖాన్‌పెట్‌లో ఉంటున్నట్టు తేలింది.

సినిమాల్లో నటిస్తోన్న సంధ్య ఆచూకీ గత కొద్ది రోజులుగా తెలియకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె భర్త, సినీ సహాయ దర్శకుడు బాలకృష్ణన్‌ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రాత్రివేళలో సంధ్య గంటల తరబడి మొబైల్‌లో మాట్లాడుతుండడం, తరుచూ బయటకు వెళ్తుండడంతో ఆమెకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని బాలకృష్ణ అనుమానం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో గొడవలు ప్రారంభమయ్యాయి.

ఈ విషయమై సంధ్యను పలుమార్లు హెచ్చరించినా ఆమె వినిపించుకోకపోగా, తాను ప్రియుడితోనే ఉంటానని తేల్చి చెప్పింది. దీంతో జనవరి 19న బాలకృష్ణన్‌, సంధ్య మరోమారు గొడవ పడ్డారు. దీంతో సహనం కోల్పోయిన బాలకృష్ణన్ కత్తితో ఆమెను విచక్షణ రహితంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఐదు ముక్కులు చేసి, గోనె సంచిల్లో కట్టి వాటిని వేర్వేరు ప్రదేశాల్లో పడేశాడు. అయితే, చెత్తకుప్పలో కాళ్లు, చేయి లభించడంతో హత్యోదంతం బయటపడింది.

డంపింగ్ యార్డ్‌లో చెత్తను జేసీబీతో లోడింగ్ చేస్తుండగా కాళ్లు, చేతులను గుర్తించిన చెన్నై కార్పొరేషన్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేశారు. చేతులపై శివుడు-పార్వతి ట్యాటూ గుర్తించారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో మిస్సింగ్ కేసులపై కూడా తమిళనాడు పోలీసులు ఆరా తీశారు. చివరకు మృతురాలిని నటి సంధ్యగా తేల్చిన పోలీసులు, ఆమె భర్తను విచారించడంతో హత్యోదంతం వెలుగులోకి వచ్చింది.





Show Full Article
Print Article
Next Story
More Stories