సూర్యాపేటలో దారుణం.. టీఆర్ఎస్ మాజీ సర్పంచ్ దారుణ హత్య

సూర్యాపేటలో దారుణం.. టీఆర్ఎస్ మాజీ సర్పంచ్ దారుణ హత్య
x
సూర్యాపేటలో దారుణం.. టీఆర్ఎస్ మాజీ సర్పంచ్ దారుణ హత్య
Highlights

సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. ఎర్కారం మాజీ సర్పంచ్‌, టీఆర్ఎస్ నేత ఒంటెద్దు వెంకన్న దారుణ హత్యకు గురయ్యారు. రెండు రోజులుగా సహకార ఎన్నికల విషయంలో...

సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. ఎర్కారం మాజీ సర్పంచ్‌, టీఆర్ఎస్ నేత ఒంటెద్దు వెంకన్న దారుణ హత్యకు గురయ్యారు. రెండు రోజులుగా సహకార ఎన్నికల విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్‌ వర్గాల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఒంటెద్దు వెంకన్నను దుండగులు రాళ్లతో కొట్టి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సహకార ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన ఓటర్లను సూర్యాపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉంచగా కాంగ్రెస్ వర్గీయులు అక్కడికి వెళ్లడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి కాంగ్రెస్ వర్గీయులపై టీఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడ్డారు.

జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న కాంగ్రెస్ వర్గీయులు అదును కోసం వేచి చూసి ఎన్నికల ప్రచారంలో ఉన్న వెంకన్నను అర్ధరాత్రి సమయంలో వెంబడించి హత్య చేశారు. ఈ దాడిలో గాయపడ్డ మరికొంతమంది కార్యకర్తల్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. గ్రామంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండాచర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories