తెలుగు రాష్ర్టాల్లో దారుణ ఘటనలు.. ఆస్తి కోసం కన్న తల్లులను హతమార్చిన కసాయి కొడుకులు !

తెలుగు రాష్ర్టాల్లో దారుణ ఘటనలు.. ఆస్తి కోసం కన్న తల్లులను హతమార్చిన కసాయి కొడుకులు !
x
తెలుగు రాష్ర్టాల్లో దారుణ ఘటనలు
Highlights

తెలుగు రాష్ర్టాల్లో దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఆస్తి కోసం కన్నతల్లిపై విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేయగా, సూర్యాపేట...

తెలుగు రాష్ర్టాల్లో దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఆస్తి కోసం కన్నతల్లిపై విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేయగా, సూర్యాపేట జిల్లాలో సవతి తల్లి ఆమె కూతుర్ని రోకలి బండతో కొట్టి హత్య చేశాడు ఓ కొడుకు.

శ్రీకాకుళం జిల్లా టెక్కలి రామదాసుపేటకు చెందిన కోతి అనసూయమ్మ కొంత కాలం క్రితం భర్త చనిపోయాడు. అనసూయమ్మకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆస్తి అంతా కూతుర్లకే ఇచ్చేసిందన్న కోపంతో కన్న కొడుకు రామకృష్ణ తల్లిపై కోపం పెంచుకున్నాడు. తల్లీకొడుకు మద్య చాలా కాలంగా ఆస్తి గొడవ జరుగుతుంది. తల్లితో గోడవకు దిగిన కొడుకు మంచం కోడుతో బలంగా తలపై కొట్టాడు. అనసూయమ్మ అక్కడికక్కడే ప్రాణం విడిచింది. నిందితుడు రామకృష్ణ పోలీసులకు లొంగిపోయాడు. టెక్కలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సూర్యాపేట జిల్లాలోనూ ఆస్తి కోసం సవతి తల్లి, ఆమె కూతుర్ని రోకలి బండతో కొట్టి దారుణంగా హత్య చేశాడు కొడుకు. తాళ్లకంపాడ్ గ్రామానికి చెందిన రేషన్ డీలర్ కప్పల నాగయ్య భార్య అచ్చమ్మకు ఆరోగ్యం భాగా లేకపోవడంతో ఆమె చెల్లలు అంజమ్మను పెళ్లి చేసుకున్నాడు. పెద్ద భార్య అచ్చమ్మకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. చిన్న భార్య అంజమ్మకు ఒక కూతురు ఉంది. పదేళ్ల క్రితం నాగయ్య చనిపోయాడు. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. నాగయ్య పెద్ద భార్య కొడుకు హరీష్ అంజమ్మను, ఆమె కూతురని కొట్టి చప్పి పోలీసులకు లొంగిపోయాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories