హైదరాబాద్‎లో దారుణం... వ్యక్తిని ఢీకొట్టి 8కిలోమిట్లరు ఈడ్చుకెళ్లిన క్యాబ్ డ్రైవర్

హైదరాబాద్‎లో దారుణం... వ్యక్తిని ఢీకొట్టి 8కిలోమిట్లరు ఈడ్చుకెళ్లిన క్యాబ్ డ్రైవర్
x
Highlights

ఓ ప్రముఖ సంస్థకు చెందిన క్యాబ్ డ్రైవర్ ఓ వ్యక్తిని ఢీకొట్టి ఏనిమిది కిలోమిట్లరు ఈడ్చుకెళ్లి ఘటన శంషాబాద్‎లో జరిగింది. స్థానికంగా ఈ సంఘటన కలకలం సృష్టించింది.

హైదరాబాద్‎లో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రముఖ సంస్థకు క్యాబ్ డ్రైవర్ వ్యక్తిని ఢీకొట్టి ఏనిమిది కిలోమిట్లరు ఈడ్చుకెళ్లి ఘటన శంషాబాద్‎లో జరిగింది. మంగళవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణీకులను ఎక్కించుకునేందుకు ఓ క్యాబ్ డ్రైవర్ నోపార్కింగ్ జోన్‌లో కారును నిలిపిపాడు. యాదయ్య అనే ప్రయాణికుడిని ఎక్కించుకుంటున్న సమయంలో.. పోలీసు వాహనం రావడాన్ని గమనించాడు. దీంతో కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఈ క్రమంలో యాదయ్య చోక్కా కారు డోరులో చిక్కుకుపోయింది. బాధితుడు ఎంతగా అరుస్తున్నా డ్రైవర్ వినిపించుకోలేదు. పోలీసులు వెంబడిస్తున్నారన్న కంగారులో డ్రైవర్ పట్టించుకోకుండా కారును నడిపాడు. అలా దాదాపు 8 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత శంషాబాద్ టోల్‌గేట్ వద్ద సిబ్బంది గమనించి విషయం డ్రైవర్‌కు చెప్పాడు. అప్పటికే యాదయ్య ప్రాణాలు విడిచాడు, దీంతో డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పరారైయ్యాడు. స్థానికులు సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నంబర్ ఆధారంగా విచారణ చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories