ఒకరి ప్రాణం తీసిన బెల్టు షాపుల వివాదం

Wine Shop
x
Wine Shop
Highlights

రెండు బెల్టు షాపుల మధ్యవివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గాంధీ బొమ్మ సెంటర్‌లో రెండు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు.

రెండు బెల్టు షాపుల మధ్యవివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గాంధీ బొమ్మ సెంటర్‌లో రెండు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. వీటిలో ఓ బెల్ట్ షాప్‌ను ఉపేందర్‌, మరో బెల్ట్‌ షాప్‌ను చల్లా రోశయ్య అనే వ్యక్తులు నిర్వహిస్తున్నారు. ఉపేందర్‌ బావమరిది వినయ్‌, రోశయ్య కుమారుడు ప్రతాప్‌ మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో తలకు బలమైన గాయమైన ప్రతాప్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ప్రతీకారంగా రోశయ్య బంధువులు ఉపేందర్ బెల్ట్ షాపు, ఇంటిపై దాడి చేసి సామాగ్రీ ధ్వంసం చేశారు. ఫర్నీచర్ తగులపెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితిని అదుపుచేస్తున్న పోలీసులపై తిరగబడ్డారు. పోలీసు వాహనంపై దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు లాఠీచార్జి జరిపారు. కొందరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లర్జు జరిగే అవకాశం ఉండటంతో పోలీసు బలగాలను రప్పిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories