ఆరోపణలన్నీ అవాస్తవం.. బిడ్డ చావులో నా ప్రమేయం లేదు : ద్వారక తల్లి

ఆరోపణలన్నీ అవాస్తవం.. బిడ్డ చావులో నా ప్రమేయం లేదు : ద్వారక తల్లి
x
Highlights

విజయవాడలో సంచలనం సృష్టించిన చిన్నారి ద్వారక మువ్వ హత్య ఘటనలో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ద్వారక మువ్వ హత్యలో సొంత తల్లి పాత్ర ఉందటూ ఆరోపణలు...

విజయవాడలో సంచలనం సృష్టించిన చిన్నారి ద్వారక మువ్వ హత్య ఘటనలో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ద్వారక మువ్వ హత్యలో సొంత తల్లి పాత్ర ఉందటూ ఆరోపణలు వచ్చాయి. అయితే తన బిడ్డ చావులో తన ప్రమేయం ఉందన్న వార్తలన్ని అవాస్తావాలని ద్వారకా మువ్వ తల్లి చెబుతోంది. కన్నబిడ్డను చంపుకుని కసాయి తల్లిని కాదంటూ వెల్లడించింది.

ప్రకాష్ తమ బిడ్డను చంపుతాడనే అనుమానం తామకు రాలేదని అందుకే తాము బిడ్డ కోసం చూట్టు ప్రక్కల ప్రాంతాలు గాలించామని ద్వారక తల్లి తెలిపింది. తమ చిన్నారిని చంపి మా కుటుంబ సభ్యుల మధ్యే ఏమి తెలియనట్లు వచ్చి కూర్చున్నాడని. ప్రకాష్ భార్య ఏటీఏం కోసం ఇంటికి వెళ్లితే ఏటీఏం కార్డు తీయబోగా కార్డు జారీ పడిందని, అప్పుడు తమ చిన్నారిని గొని సంచిలో కట్టి పెట్టిన మృతదేహం బయటపడిందని తమ ఇంటి పక్కల వారికి చెప్పిందని చిన్నారి తల్లి చెప్పింది. మా పాపను చంపి మాపైనే నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. పాప మధ్యాహ్నాం మూడున్నర గంటల నుంచి కనిపించలేదని, సాయంత్రం ఆరు గంటల నుంచి పాప కోసం గాలించామని ద్వారక తల్లి తెలిపింది. చిన్నారిని వేతకడానికి తమతో పాటు హంతకుడు ప్రకాష్ కూడా వచ్చాడని తెలిపింది.

పాప ప్రకాష్‌ను పెదనాన్నా అంటూ పిలుస్తుందని, అలాంటింది అభం శుభం తెలియని చిన్నారిని అత్యంత దారుణంగా చంపాడనికి చేతులు ఏలా వచ్చాయో అంటూ చిన్నారి తల్లి కన్నీరుమున్నీరైంది. ప్రకాష్‌ను కఠినంగా శిక్షించాలని, అతని భార్య కూడా అతన్ని శిక్షించాలని కోరుతుందని చిన్నారి తల్లి చెప్పింది. ద్వారక అంతిమ సంస్కారాలు అయ్యేలోగా నిందితుడిని కఠిన శిక్షించాలని చిన్నారి తల్లి డిమాండ్ చేస్తుంది. గ్రామస్థులు కూడా ప్రకాష్‌ను కఠినంగా శిక్షించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories