దారుణం : బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కామాంధుడు

దారుణం : బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కామాంధుడు
x
Highlights

కర్నూలు జిల్లాలోని కౌతాలం మండలం బదినేహల్‌లో దారుణం జరిగింది. మౌలాల్ అనే వ్యక్తి గత కొంతకాలంగా బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. చివరికి...

కర్నూలు జిల్లాలోని కౌతాలం మండలం బదినేహల్‌లో దారుణం జరిగింది. మౌలాల్ అనే వ్యక్తి గత కొంతకాలంగా బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. చివరికి కామాంధుడు బాలికపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. మంటలకు తట్టుకోలేక బాలిక కేకలు వేయడంతో గమనించిన స్థానికులు మంటలను ఆర్పి ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియవచ్చింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బదినేహల్‌లో 12ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన మౌలా సాహెబ్ గత ఆరు నెలలుగా వెంటపడి వేధిస్తున్నాడు. దీంతో మౌలా సాహెబ్ వేధింపులు తట్టుకోలేక ఆ బాలిక విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో పగబట్టిన కామాంధుడు ఆమెను అంతం చేసేందుకు సిద్ధమయ్యాడు. దీంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గమనించిన స్థానికులు బాలికను హుటాహుటిన ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

అయితే, బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన మౌలా సాహెబ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. బాలికపై పెట్రోదాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి క్రూర మృగాలను సమాజంలో లేకుండా చేయాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories