శంషాబాద్‌లో మహిళ మృతి కేసులో పురోగతి

శంషాబాద్‌లో మహిళ మృతి కేసులో పురోగతి
x
Highlights

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సిద్ధులగుట్ట వద్ద మహిళ హత్య కేసు మిస్టరీగా మారింది. మహిళది హత్యా..? ఆత్మహత్యా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు...

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సిద్ధులగుట్ట వద్ద మహిళ హత్య కేసు మిస్టరీగా మారింది. మహిళది హత్యా..? ఆత్మహత్యా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి సుమారు 25 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉంటుందని అంచనాకు వచ్చారు. ఘటనాస్థలిలో కాలిపోయిన చీర, గాజులు, మరికొన్ని వస్తువులు పోలీసులు సేకరించారు. సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించనున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే ఉస్మానియా ఆస్పత్రిలో మహిళ మృతదేహానికి ఇవాళ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మహిళ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిన్న సాయంత్రం మహిళ సంచరించడాన్ని స్థానికులు గుర్తించారు. ఏడుస్తూ తిరిగిన మహిళను ఓ పూజారి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మహిళ హిందీలో మాట్లాడిందని తనకు అర్థంకాలేదని పూజారి చెప్పినట్లు సమాచారం. అయితే మహిళ ఆత్మహత్య చేసుకొని ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన మహిళ ఉత్తరాదివాసిగా భావిస్తున్నారు. సిద్దులగుట్ట ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మహిళకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories