హైదరాబాద్ నడి బొడ్డులో కత్తులతో వెంటాడి హత్య!

హైదరాబాద్ నడి బొడ్డులో కత్తులతో వెంటాడి హత్య!
x
Highlights

హైదరాబాద్ లోని అత్యంత కీలకప్రాంతమైన పంజాగుట్ట లో నాగార్జున సర్కిల్ వద్ద నడిరోడ్డు పై ఒకరిని కత్తులతో వెంబడించి కిరాతకంగా హత్య చేయడం ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది.

హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో పట్టపగలు ఓ వ్యక్తిని కత్తులతో వెంబడించి హతమార్చారు దుండగులు. ఆదివారం ఉదయం కొందరు దుండగులు రియాసద్ అలీ(40) అనే ఆటోడ్రైవర్ ను నడిరోడ్డుపై వెంబడిస్తూ కత్తులతో కిరాతకంగా నరికేశారు. తీవ్ర రక్తస్రావంతో అలీ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో దుండగులు ఆ ప్రాంతం నుంచి పరారయ్యారు.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు సమీపంలోని నాగార్జునా సర్కిల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకోగా.. నడిరోడ్డు పై ఓ వ్యక్తి ప్రాణభయంతో పరుగులు తీస్తూ ఉంటే, ముష్కరులు అతనిని కత్తులతో వెంబడించడం అక్కడి వారిని తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది.

మృతుడు హత్యకేసులో నిందితుడు..

జూన్ నెలలో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ సమీపంలోనే అహ్మద్ అనే ఆటోడ్రైవర్‌ను హత్యకేసిన కేసులో అలీ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అప్పటి నుంచి జైలులో ఉన్న అతడు ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో టీ తాగేందుకు నాగార్జున సర్కిల్‌కు వచ్చిన అలీని కొందరు దుండగులు కత్తులతో వెంబడించారు. డీవీఐఆర్‌టీ సిటీ సెంటర్ భవనం ఎదుట అతడిని ముట్టడించి కత్తులతో నరికి పారిపోయారు.

హత్య సమాచారం తెలుసుకున్న వెంటనే పంజాగుట్ట పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఆహ్మద్ హత్యకు ప్రతీకారంగానే అలీని చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వెస్ట్‌జోన్ డీసీపీ సుమతి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories