ఫార్మసీ విద్యార్థిని సోనీ కిడ్నాప్ కేసులో నిందితుడి గుర్తింపు

ఫార్మసీ విద్యార్థిని సోనీ కిడ్నాప్ కేసులో నిందితుడి గుర్తింపు
x
Highlights

హయత్ నగర్ ఫార్మసీ కాలీజీ విద్యార్థిని కిడ్నాప్ కేసులో పోలీసులు ముందడుగు వేశారు. మూడు రోజుల క్రితం బీఫార్మసీ చదువుతున్న విద్యార్థిని సోనీని కిడ్నాప్...

హయత్ నగర్ ఫార్మసీ కాలీజీ విద్యార్థిని కిడ్నాప్ కేసులో పోలీసులు ముందడుగు వేశారు. మూడు రోజుల క్రితం బీఫార్మసీ చదువుతున్న విద్యార్థిని సోనీని కిడ్నాప్ కు గురైంది. కిడ్నాప్ సమయంలో ఆమెను కారులో ఎక్కించుకున్న నిందితుడిని పోలీసులు గుర్తించారు. కిడ్నాపర్ విజయవాడకు చెందిన పాత నేరస్తుడు రవిశంకర్‌గా గుర్తించారు.

ఉద్యోగం ఇప్పిస్తానని ఈ నెల 23న మాయమాటలు చెప్పి యువతి, ఆమె తండ్రి, సోదరుడిని ఇబ్రహీంపట్నం నుంచి నిందితుడు కారులో తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో తండ్రి, సోదరుడిని దించేసి వెళ్లిపోయాడు.వారి ఫిర్యాదు మేరకు యువతి ఆచూకీ కోసం పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపడుతున్నారు. విజయవాడ, బెంగళూరు నగరాలతోపాటు జాతీయ రహదారులపైనా పోలీసులు గాలిస్తున్నారు. యువతిని అపహరించిన సమయంలో ఉపయోగించిన కారు కూడా నిందితుడు దొంగలించిందేనని పోలీసులు గుర్తించారు. కారు నెంబరు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories