జనగామ జిల్లాలో దారుణం : బైక్‌పై వెళుతున్న భార్యాభర్తలను కారుతో ఢీకొట్టిన ముఠా

జనగామ జిల్లాలో దారుణం : బైక్‌పై వెళుతున్న భార్యాభర్తలను కారుతో ఢీకొట్టిన ముఠా
x
Highlights

జనగామ జిల్లాలో దారుణం జరిగింది. బైక్‌పై వెళుతున్న భార్యాభర్తలను ఓ నలుగురు సభ్యుల ముఠా కారుతో ఢీకొట్టింది. బైక్‌పై వెళుతున్న బండ తిరుపతిని హత్య...

జనగామ జిల్లాలో దారుణం జరిగింది. బైక్‌పై వెళుతున్న భార్యాభర్తలను ఓ నలుగురు సభ్యుల ముఠా కారుతో ఢీకొట్టింది. బైక్‌పై వెళుతున్న బండ తిరుపతిని హత్య చేసేందుకు ప్రయత్నించారు. యాక్సిడెంట్‌ తర్వాత తిరుపతి చనిపోయాడని భావించి అతడిని అక్కడే వదిలి వెళ్లిపోయారు. తిరుపతి భార్య భాగ్యలక్ష్మిని కిడ్నాప్‌ చేసి కారులో ఎత్తుకు పోయారు. షాక్‌నుంచి తేరుకున్న తిరుపతి ప్రస్తుతం జనగామ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భాగ్యలక్ష్మిని ఎవరు కిడ్నాప్‌ చేశారని విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జనగామ మండలం పెద్ద రాంచర్ల సమీపంలో ఈ ఘటన జరిగింది. బాధితుడు బండ తిరుపతి యాదాద్రి భువనగిరి జిల్లాకి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories