గుంటూరు జిల్లలో దారుణం.. వావి వరుసలు మరచి బాలికపై అఘాయిత్యం!

గుంటూరు జిల్లలో దారుణం.. వావి వరుసలు మరచి బాలికపై అఘాయిత్యం!
x
Highlights

అఘాయిత్యాలకు అంతూ పంతూ లేకుండా పోతోంది. నిర్భయ ఘటనలూ.. దిశా సంఘటనలూ కామంధులకు కనువిప్పు కాలేకపోతున్నాయి. చట్టం కఠినంగా ఉన్నా, కఠిన శిక్షలు తప్పవని...

అఘాయిత్యాలకు అంతూ పంతూ లేకుండా పోతోంది. నిర్భయ ఘటనలూ.. దిశా సంఘటనలూ కామంధులకు కనువిప్పు కాలేకపోతున్నాయి. చట్టం కఠినంగా ఉన్నా, కఠిన శిక్షలు తప్పవని తెలిసినా కామ పిశాచులు పెట్రేగిపోతూనే ఉన్నారు. ఇంకా ఇదెంత ముదిరిపోయిందంటే.. వావి వరుసలను కూడా మర్చిపోయి అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. సమాజంలో రోజు రోజుకూ అఘాయిత్యాల పైత్యం పెరిగిపోతోంది.

తాజాగా గుంటూరులో చెల్లెలి వరుసయ్యే బాలికపై ఒక వ్యక్తి అత్యాచారం చేసిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను అన్న వరుసయ్యే వ్యక్తీ బలవంతంగా బీచ్ కు తీసుకువెళ్ళి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తల్లిదండ్రులకు చెప్పుకోలేని బాలిక అన్న వేధిస్తున్నాడని చెప్పింది. దీంతో ఆమెను చదువు మాన్పించేసి బంధువుల ఇంటికి పంపించేశారు. ఆ యువకుడిని మందలించి వదిలేశారు.

అప్పుడూ ఆ కామాంధుడికి బుద్ధిరాలేదు. కొన్నాళ్ళ తరువాత తన ఇంటికి తిరిగి వచ్చిన బాలికను మళ్ళీ వెంటాడి కాటేశాడు. దీంతో ఈసారి బాలిక తన తల్లిదండ్రులకు విషయం పూర్తిగా వివరించింది. విషయం విన్న ఆ బాలిక తల్లిదండ్రులు ఒలీసులకు ఫిర్యాదు చేశారు.

జరిగిందిదీ..

గుంటూరు జిల్లా పొన్నూరు మండలానికి చెందిన ఓ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమెకు అన్న వరుసయ్యే వ్యక్తి తాపీపని చేస్తుంటాడు. ఆ దుష్టుడు ఈ బాలికపై కన్నేశాడు. ఒకరోజు బైక్ మీద స్కూలు వద్దకు వెళ్ళిన అతను బాలికను బలవంతంగా బైక్ పై ఎక్కించుకుని బీచ్ కి తీసుకువెళ్ళాడు. అక్కడ ఏమాత్రం కనికరం చూపించకుండా ఆమెను చేరచాడు. తనను ఆ వ్యక్తి వేధిస్తున్నాడని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే, ఆ వ్యక్తిని మందలింపుతో సరిపెట్టిన పెద్దలు. బాలికకు మాత్రం పెద్ద శిక్ష వేశారు. ఆమెను చదువు మాన్పించి ఒంగోలులోని పిన్ని ఇంటికి పంపించారు.

ఇటీవల ఆ బాలిక తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న గోపి.. బాలిక తల్లిదండ్రులు బంధువుల ఇంట్లో వేడుకలకు వెళ్ళిన సమయంలో ఆమె ఇంటికి చేరుకున్నాడు. గోడదూకి ఇంట్లోకి చొరబడ్డాడు. అక్కడ ఒంటరిగా ఉన్న .. బాలికపై మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫంక్షన్ నుంచి ఇంటికి తిరిగొచ్చిన తల్లిదండ్రులకు బాలిక విషయం చెప్పింది. రేప్ జరిగిందని చెప్పలేక అన్న మరోసారి వేధిస్తున్నాడని చెప్పి భోరుమంది.

కూతురిని మళ్లీ.. మళ్లీ వేధిస్తుండడంతో బాలిక తల్లిదండ్రులు పొన్నూరు రూరల్ పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తెపై గోపి అనే వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని.. చర్యలు తీసుకోవాలని స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే మరుసటి రోజు గోపి తనను రేప్ చేశాడని బాలిక చెప్పడంతో వెంటనే స్టేషన్‌కు చేరుకుని రేప్ కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. అయితే, ఈ విషయంలో అక్కడి సిబ్బంది సరిగా స్పందించలేదని తెలిసింది. అంతేకాకుండా కుల సంఘాలు కూడా కేసు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేస్తుండడంతో ఆ బాలిక తల్లిదండ్రులు గుంటూరు రూరల్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories