ప్రేమించాను అని చెప్పి హతమార్చాడు ..

ప్రేమించాను అని చెప్పి హతమార్చాడు ..
x
Highlights

ఆమెకి పెళ్లయింది . ఓ కూతురు కూడా ఉంది . కానీ వీరెవరు వద్దు అనుకోని ప్రియుడు మోజులో పడి అతనితో వెళ్ళిపోయింది . కానీ అ తర్వాత ఓ శవంగా కనిపించింది .. ఈ...

ఆమెకి పెళ్లయింది . ఓ కూతురు కూడా ఉంది . కానీ వీరెవరు వద్దు అనుకోని ప్రియుడు మోజులో పడి అతనితో వెళ్ళిపోయింది . కానీ అ తర్వాత ఓ శవంగా కనిపించింది .. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది . స్థానికంగా ఈ ఘటన అందరిని కలిచివేసింది . ఇక వివరాల్లోకి వెళ్తే రామచంద్రాపురంకి చెందినా భానుకి రాయలచెరువుకి చెందినా మునిశేఖర్ కి ఓ పదేళ్ళ కింద వివాహం జరిగింది . వీరికి ఓ కూతురు కూడా ఉంది . అయితే గత రెండు సంవత్సరాలుగా ఆమె వాళ్ళ పుట్టంటిలోనే ఉంటుంది . ఇదే ఆసరాగా తీసుకున్న స్థానికంగా ఉండే హరి అమే పై కన్ను వేశాడు . ఆమెతో మాయమాటలు కలిపి ఆమెని ప్రేమ పేరుతో నమ్మించాడు ..

ఇలా ఆమెను బయటకు తీసుకువెళ్లి హతమార్చాడు . కూతురు కనిపించడం లేదని భాను తల్లి తండ్రులు కేసు పెట్టారు . హరిపై అనుమానం వ్యక్తం చేసారు . పోలీసులు తమదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేయగా అసలు విషయం ఒప్పుకున్నాడు హరి . భానుని తనే చంపనని, ఎదో విషయంలో ఇద్దరి మధ్య తగాదా రాగా నేను తనని కొట్టగా ఆమె చనిపోయిందని ఆమెని రామచంద్రాపురంలో పూడ్చి పెట్టనని పోలీసులకు చెప్పాడు హరి ..

ఈ విషయం తెలుసుకున్న భాను తల్లి తండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు . మునిశేఖర్ మరియు అతని కూతురు భాను ఇక రాదని రోదిస్తున్నారు . నిందుతుడు హరిపైన చర్యలు తీసుకోవాలని నిర్భయ చట్టం కింద పలు కేసులు నమోదు చేయాలనీ కోరుతున్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories