భార్యకు ప్రేమలేఖ రాశాడని కత్తితో దాడి చేసాడు...

భార్యకు ప్రేమలేఖ రాశాడని కత్తితో దాడి చేసాడు...
x
Highlights

తన భార్యకు ప్రేమలేఖ రాశాడని కత్తితో దాడి చేసాడు ఓ వ్యక్తి...ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. కొప్పునూరు గ్రామానికి చెందిన వేల్పుల...

తన భార్యకు ప్రేమలేఖ రాశాడని కత్తితో దాడి చేసాడు ఓ వ్యక్తి...ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. కొప్పునూరు గ్రామానికి చెందిన వేల్పుల నగేష్ అనే యువకుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి చికెన్ షాపు నిర్వాహకుడు హిమామ్‌తో పరిచయం ఉంది. ఈ నేపధ్యంలో హిమామ్ భార్యను చూసి మనసుపడ్డాడు నగేష్. ఏకంగా ఆమెకి ప్రేమలేఖను రాశాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకి చెప్పడంతో ఆగ్రహానికి గురైన హిమామ్‌ అతడిపై కక్షను పెంచుకున్నాడు. విషయం తెలుసుకున్నా నగేష్ హిమామ్‌ ఊరికి వెళ్ళడం మానేశాడు. ఈ క్రమంలో ఏడాది తర్వాత మళ్ళీ ఆ ఊరికి వెళ్ళడంతో పాత కక్షను గుర్తు చేసుకున్న హిమామ్‌ అతడిపై కత్తితో దాడి చేసి పారిపోయాడు . అక్కడే ఉన్న స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.చికిత్స అనంతరం భాదితుడు పోలిస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories